ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించేందుకు నలుగురు హీరోయిన్లు పోటీ పడ్డారట. కానీ చివరికి ఒక్కరికి మాత్రమే అవకాశం దక్కింది. ఈ విషయాన్ని నిర్మాత కృష్ణ ప్రసాద్ తెలిపారు. ముందుగా ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఊర్మిళ మంటోడ్కర్ ని అనుకున్నారట. నిర్మాత వెళ్లి ఆమె కుటుంబాన్ని కూడా అడిగారు. అప్పట్లో సింగితం శ్రీనివాసరావు కి బాలీవుడ్ లో కూడా గుర్తింపు ఉండేది. దీనితో ఊర్మిళ వెంటనే ఆదిత్య 369 చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ప్రస్తుతం తాను నటిస్తున్న ఒక హిందీ చిత్రానికి అగ్రిమెంట్ ఉందని, వెళ్లి వాళ్ళ అనుమతి తీసుకోమని ఊర్మిళ కోరింది. షెడ్యూల్స్, డేట్ల సమస్యలు వస్తాయని ఆ నిర్మాతలు ఒప్పుకోలేదు.