చిరంజీవికి చెందిన ఆ మూడు ఫార్మ్ హౌస్ ల ధర ఎన్ని వందల కోట్లో తెలుసా? ఇంత సంపద ఉందా!

First Published Oct 10, 2024, 7:53 PM IST

చిరంజీవి టాలీవుడ్ రిచెస్ట్ హీరో. వేల కోట్ల ఆస్తులు ఆయన సొంతం. మూడు ప్రధాన ఏరియాల్లో ఆయనకు ఫార్మ్ హౌస్లు ఉన్నాయి. వాటి ధర తెలిస్తే మీరు అవాక్కు అవుతారు. 
 

Chiranjeevi

90లలో చిరంజీవి దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా ఉన్నారు. ప్రముఖ మ్యాగజైన్ కథనం ప్రకారం.. ఆయన అమితాబ్ కంటే ఎక్కువ ఛార్జ్ చేశాడట. గ్యాంగ్ లీడర్ సక్సెస్ అనంతరం చిరంజీవి రెమ్యూనరేషన్ రూ.1.25 కోట్లు అట. అప్పటికి తన తోటి హీరోలు లక్షల్లో తీసుకుంటున్నారు. 
 

తాను సంపాదించిన మొత్తంలో కొంత సామాజిక సేవకు వినియోగించాడు చిరంజీవి. అదే సమయంలో భారీగా ఆస్తులు ఆర్జించాడు. కెరీర్ బిగినింగ్ లో చిరంజీవి చెన్నై లో ఉండేవారు. అక్కడ ఆయనకు సొంత ఇల్లు ఉంది.  అలాగే కొన్ని ఆస్తులు ఉన్నాయి. 2009 ఎన్నికల్లో పోటీ చేసిన చిరంజీవి చెన్నైలోని ఖరీదైన ఆస్తులు అమ్మారనే ఓ వాదన ఉంది.దీనిపై స్పష్టత లేదు. 

రామ్ చరణ్ స్టార్ అయ్యాక చిరంజీవి సంపద మరింత పెరిగింది. చిరంజీవి కోడలు ఉపాసన అపోలో హాస్పిటల్స్ కి ఛైర్ పర్సన్. అపోలో గ్రూప్ లో ఉపాసన వాటా విలువ రూ. 10 వేల కోట్లు ఉంటుందని అంచనా. మెగాస్టార్ ఫ్యామిలీ కి సొంత చార్టెడ్ ఫ్లైట్ ఉంది. ఇండియా లో ఎక్కడికి వెళ్లాలన్నా... అందులోనే ప్రయాణం చేస్తారు. రోల్స్ రాయిస్ తో పాటు ఖరీదైన కార్లకు లెక్కే లేదు. 
 

Latest Videos


Chiranjeevi

కాగా చిరంజీవికి చాలా ప్రాంతాల్లో స్థిరాస్తులు ఉన్నాయి. వాటిలో మూడు ఫార్మ్ హౌస్ ల గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. బెంగుళూరు నగర శివార్లలోని కెంపె గౌడ విమానాశ్రయం సమీపంలో గల దేవనహళ్లిలో చిరంజీవికి ఒక ఫార్మ్ హౌస్ ఉంది. సూపర్ స్టార్ రజినీకాంత్ కి కూడా అక్కడ ఫార్మ్ హౌస్ ఉంది. దాని పక్కనే కొన్ని ఎకరాల్లో చిరంజీవి ఫార్మ్ హౌస్ ఉందని సమాచారం. 

ఈ ఏడాది సంక్రాంతి వేడుకలను మెగా ఫ్యామిలీ అక్కడే జరుపుకుంది. అప్పుడప్పుడు చిరంజీవి కుటుంబ సభ్యులు అక్కడకు వెళతారు. ఈ ఫార్మ్ హౌస్ విలువ రూ. 40 కోట్లు ఉంటుందట. 
 

Chiranjeevi

చిరంజీవి చాలా కాలం క్రితం కోకాపేటలో స్థలం కొని ఫార్మ్ హౌస్ నిర్మించారు. హైదరాబాద్ నగరం విస్తరించడంతో కోకాపేట భూముల ధరలు ఆకాశానికి చేరాయి. సైరా నరసింహారెడ్డి మూవీ సెట్స్ ఈ ఫార్మ్ హౌస్లోనే ఏర్పాటు చేశారు. సదరు సెట్స్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో కోకాపేట చిరంజీవి ఫార్మ్ హౌస్ వార్తలకు ఎక్కింది. దాదాపు రూ. 2 కోట్లు విలువైన సెట్ దగ్ధమైంది. 

చాలా ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఫార్మ్ హౌస్ ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 200 కోట్లు ఉంటుందని సమాచారం. తరచుగా చిరంజీవి ఈ ఫార్మ్ హౌస్ ని సందర్శిస్తూ ఉంటారని వినికిడి. 
 

chiranjeevi


ఇటీవల చిరంజీవి ఊటీలో ఒక ల్యాండ్ కొన్నారు. అక్కడ మరో ఫార్మ్ హౌస్ నిర్మించాలనేది ఆయన ఆలోచన. వ్యాపారవేత్తలు, ప్రముఖులు, ధనవంతులు ఊటీలో ల్యాండ్ కొని ఫార్మ్ హౌస్ నిర్మించుకుంటారు. ఖాళీ సమయంలో అక్కడకు వెళ్లి సేద తీరుతారు. అనేక మంది నటులకు ఊటీలో ఫార్మ్ హౌస్లు ఉన్నాయి. 

చిరంజీవి రూ. 16 కోట్లు పెట్టి ఊటీలో స్థలం కొన్నారట. రామ్ చరణ్, ఉపాసన కూడా ఆ స్థలాన్ని సందర్శించారట. బెంగుళూరు, హైదరాబాద్ కోకాపేట, ఊటీ ప్రాంతాల్లో చిరంజీవికి ఉన్న ఈ మూడు ఫార్మ్ హౌస్ల విలువ రూ. 256 కోట్లు అని ఒక అంచనా. 

కాగా ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర మూవీ చేస్తున్నారు. ఇది సోషియో ఫాంటసీ చిత్రం. దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ మూవీని 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే వాయిదా పడే సూచనలు కలవట. చిరంజీవికి జంటగా త్రిష నటిస్తుంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు.

బిగ్ బాస్ హౌజ్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

click me!