సాక్షి లోగోతో కర్నూలు పర్యటన.. క్లారిటీ ఇచ్చిన రేణుదేశాయ్!

First Published Feb 27, 2019, 12:38 PM IST

రాష్ట్రంలో కరువు నేపధ్యంలో రైతుల కష్టాలపై, ఆత్మహత్యలకు దారి తీస్తోన్న పరిస్థితులపై రేణుదేశాయ్ అధ్యయనం చేస్తున్నారు. 

రాష్ట్రంలో కరువు నేపధ్యంలో రైతుల కష్టాలపై, ఆత్మహత్యలకు దారి తీస్తోన్న పరిస్థితులపై రేణుదేశాయ్ అధ్యయనం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె కర్నూలు జిల్లాకు వెళ్లి అక్కడ రైతులతో మాట్లాడారు.
undefined
వారి బాధలు విని కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు రేణుదేశాయ్. అంతేకాదు.. బాబు ప్రభుత్వాన్ని తక్కువ చేసి మాట్లాడుతూ శాపనార్ధాలు కూడా పెట్టారు.
undefined
పవన్ కల్యాణ్ కర్నూలు పర్యటన చేస్తున్న సమయంలో అదే జిల్లాలో రేణూ దేశాయ్ పర్యటించడంతో దీని వెనుక రాజకీయవ్యూహాలు ఉన్నాయని భావించారు.
undefined
ఇదంతా గమనించిన జనాలు ఆమె రాజకీయాల్లోకి వస్తుందేమో అనుకున్నారు. సాక్షి టీవీ లోగోతో ఆమె కనిపించడంతో వైఎస్ జగన్ తన రాజకీయం కోసం రేణుదేశాయ్ ని ఉపయోగించుకున్నట్లు ఊహాగానాలు వినిపించాయి.
undefined
వీటిపై స్పందించిన రేణు తన పర్యటనలో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేసింది. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలియబరచడానికే కర్నూలు వెళ్లినట్లు తెలిపింది.
undefined
రైతులకు మంచి జరగాలని మనస్పూర్తిగా చేస్తోన్న షో ఇదని దీనికి రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదని.. వందల మంది రైతులను కలిసి వారి ఇష్యూలు తెలుసుకున్న తరువాత చాలా బాధ పడ్డాను అంటూ చెప్పుకొచ్చింది.
undefined
తన కారణంగా ఒక్క రైతు జీవితం మారిన ఎంతో సంతృప్తికరంగా ఉంటుందని.. ఆ కారణంగానే షో చేశానని క్లారిటీ ఇచ్చింది.
undefined
click me!