జానకమ్మ కెరీర్లో ఆమె భర్త వి. రామప్రసాద్ సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేనిది. 1997లో ఆయన చనిపోయారు. ఆ ఘటనతో జానకమ్మ జీవితం పూర్తిగా మారిపోయింది. అప్పటి నుంచి ఆమె తనకిష్టంగా రంగుల చీరలు, బంగారు అంచు చీరలు కట్టుకోవడం మానేశారు.
25
గాయనిగా భర్త ఇచ్చిన ప్రోత్సాహం
ఎస్. జానకి చిన్నప్పటి నుంచే పాటలు పాడేవారు. కానీ, రామప్రసాద్తో పెళ్లి తర్వాత ఆమె గాన ప్రస్థానం మరింత ఉన్నత స్థాయికి చేరింది. జానకమ్మ గొంతును, ప్రతిభను రామప్రసాద్ ఎంతగానో మెచ్చుకునేవారు. ఆమెకు అన్ని విధాలా అండగా నిలిచి, ప్రోత్సాహం అందించారు. ఆయన ఇచ్చిన ధైర్యంతోనే జానకమ్మ గాన రంగంలో శిఖరాలను అధిరోహించారు.
35
మారిపోయిన జీవితం
1997లో రామప్రసాద్ కన్నుమూశారు. ఈ ఘటన జానకి జీవితంలో తీవ్ర విషాదాన్ని నింపింది. భర్త దూరం కావడంతో ఆమె తీవ్రంగా కుంగిపోయారు. తన జీవితంలో ఒక ముఖ్యమైన భాగాన్ని కోల్పోయినట్లు ఆమె భావించారు.
భర్త చనిపోకముందు జానకమ్మ రంగురంగుల చీరలు కట్టేవారు. జడలో మల్లెపూలు, నుదుట పెద్ద కుంకుమ బొట్టుతో కళకళలాడేవారు. కానీ, రామప్రసాద్ మరణం తర్వాత ఆమె స్వయంగా వీటన్నింటికీ దూరమయ్యారు. అప్పటినుంచి తెలుపు లేదా లేత రంగు చీరలనే కట్టడం మొదలుపెట్టారు. తన భర్తపై ఉన్న ప్రేమకు, గౌరవానికి గుర్తుగా ఆమె ఈ మార్పు చేసుకున్నారు. మన దేశంలో స్త్రీలు భర్త మరణించినప్పుడు దానిని సాంప్రదాయంగా ఫాలో అవుతారు.
55
దీని అర్థం ఏంటి?
భర్త మరణానికి సంతాపంగా, ఆయనకు గౌరవ సూచకంగా జానకమ్మ రంగుల చీరలను వదిలేశారు. తెలుపు రంగు సాధారణంగా పవిత్రతకు, వైరాగ్యానికి చిహ్నం. ఆమె ఎప్పుడూ ఆధ్యాత్మికతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. బాహ్య ఆకర్షణల కంటే అంతర్గత శాంతికే ఆమె విలువిచ్చారు. రామప్రసాద్ మరణం తర్వాత ఆమెలోని నిరాడంబరత మరింత పెరిగింది. ఆడంబరాలకు దూరంగా, సాధారణ జీవితాన్ని గడిపారు.