అలాగే సంపాదన గురించి చెబుతూ, మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత దాన ధర్మాలు చేసి, పొలాలు కొనాలని చెప్పేవారు. ఆయన ఇండస్ట్రీకి చేశాను, అందరికి చేశాడు, తన ఫ్యామిలీకి చేశాడు, తను కూడబెట్టుకున్నాడు. తను నాలుగు రోజుల్లో చనిపోతాడనగా, నాకు ఫోన్ చేసి అరేయ్ వచ్చి వెళ్లిపోతున్నాను, ఓ నాలుగు రోజులు మా ఇంట్లో ఉండాలి రా అన్నాడట. ఓ రోజు ఢిల్లీ నుంచి దిగుతుంటే ఎయిర్ పోర్ట్ లో ఫోన్ వచ్చింది. చెప్పడానికి అతను భయపడ్డాను, వినడానికి నాకు భయమేసింది, విని తట్టుకోలేకపోయాను` అని వెల్లడించారు కృష్ణంరాజు. శోభన్బాబు పేరిట అందించిన అవార్డు ఫంక్షన్లో కృష్ణంరాజు ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది.