ట్యాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన తాజా చిత్రం 'కీడా కోలా'. ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్ కీలక పాత్రలో సైతం నటించారు. చైతన్య, రాగ్ మయూర్, జీవన్ కుమార్, బ్రహ్మానందం ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. కతరుణ్ భాస్కర్ ఇప్పటి వరకు తెరకెక్కించింది రెండు చిత్రాలే. అయినప్పటికీ తన చిత్రాలు వైవిధ్యంగా ఉండేలా చూసుకున్నారు. దీనితో కీడా కోలా ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి నెలకొంది. రానా దగ్గుబాటి సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కడం మరో విశేషం. నేడు గ్రాండ్ గా ఈ చిత్రం రిలీజ్ అవుతోంది.