గత ఏడాది విజయ్ కొడుకు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నట్లు, ఆయన తొలి చిత్రాన్ని లైకా సంస్థ నిర్మిస్తున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఆ ప్రకటన వచ్చి ఏడాది దాటినా ఇంకా షూటింగ్ మొదలు కాలేదు. సినిమాలో నటించడానికి హీరో దొరకక ఇబ్బంది పడిన జాసన్ సంజయ్ చివరికి నటుడు సందీప్ కిషన్ ని ఎంచుకున్నారు.