ఈ సందర్భంగా శ్రీరెడ్డిని ఉద్దేశిస్తూ తేజస్వి మదివాడ మాట్లాడుతూ, చేయాల్సిన తప్పు చేసేసి, నన్ను అందరు వాడుకున్నారని, నన్ను మొత్తం నాశనం చేశారని, గోల చేయడం వల్ల ఉపయోగం ఉండదని చెప్పింది. తాను ఈ ఇండస్ట్రీలో ఉన్నానని కాదు, ప్రతి అమ్మాయికి ఓ సందేశం ఇచ్చేలా కమిట్మెంట్ మూవీ ఉంటుందని చెప్పింది. నువ్వు చేసేది తప్పా;? రైటా? తేల్చుకోవాల్సింది నువ్వే అని, అంతా అయిపోయాక నన్ను వాడుకున్నారు, ఇలా చేశారని కామెంట్ చేయడం తనకు నచ్చదని తెలిపింది. నీకు తెలియకుండా నిన్ను ఎవరూ ఏం చేయలేరు, కమిట్మెంట్ నీకు ఇవ్వాలని లేకపోతే అసలు నిన్ను అడిగే వారూ ఎవరూ ఉండరని చెప్పింది తేజస్వి.