ధనుష్ - ఐశ్వర్యది ఫేక్ లైఫ్... నిర్మాత సంచలన వ్యాఖ్యలు, జీవితంలో కూడా నటిస్తున్నారంటూ విమర్శ.

First Published Apr 24, 2024, 5:14 PM IST

స్టార్ హీరో ధనుష్.. రజినీకాంత్ గారాల కూతురు ఐశ్వర్య విడాకుల విషయంలో కోర్టులో ఉంది. కాగా వీరి విషయంలో సంచలన వ్యాక్యలు చేశారు తమిళ నిర్మాత రాజన్. ఇంతకీ ఆయన ఏంటున్నారంటే..? 
 

త్వరలో విడాకులు తీసుకోబోతున్నారు తమిళ స్టార్ హీరో ధనుష్, రజినీకాంత్ కూతురు ఐశ్వర్య. అయితే వీరు విడాకులు ప్రకటన తరువాత కూడా ఒకరిని మరొకరు విష్ చేసుకోవడం.. హార్ట్ టాపిక్ గా మారింది. 

అంతే కాదు  పిల్లల కోసం కొన్ని కార్యక్రమాలు కలిసి చేయాలని వారు నిర్ణయించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా వారి పిల్లల స్కూల్ ఫంక్షన్స్ కు ఇద్దరు కలిసి హాజరయ్యారు కూడా. 

స్టార్ హీరోలకు షాక్ ఇచ్చిన శివకార్తికేయన్, నడిగర్ సంఘ భవనానికి భారీగా విరాళం...?

ఈ విషయంలో ఫ్యాన్స్ కు చిన్న హోప్ ఉంది. మళ్ళీ వీరు కలుస్తారేమో అని. కాని వీరు విడాకులు ప్రకటించి.. మళ్ళీ ఇలా చేయడంపై కొంత మంది విమర్షిస్తున్నారు కూడా. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూల్ ప్రముఖ నిర్మాత కె.రాజన్ మాట్లాడుతూ.. వీరిది ఫేక్ లైఫ్ అని అన్నారు. ధనుష్, ఐశ్వర్యలు సినిమాలతో పాటు నిజజీవితంలో కూడా నటించే జంట అని బహిరంగంగానే  విమర్శించారు. 
 

ఎన్టీఆర్ ను యంగ్ టైగర్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా..? దాని వెనకున్న కథ ఇదే..?

కె.రాజన్ మాట్లాడుతూ.. ధనుష్ - ఐశ్వర్య ఆలోచించుకోవాలి అన్నారు. ఇదేమి బొమ్మలాట కాదు.. 18 ఏళ్లు కలిసి కాపురం చేసిన వారు.. తప్పు ఒప్పులను సరిదిద్దుకుంటూ వెళ్ళాలి.. అందుకే వారి  కొడుకుల కోసం అయినా.. ఇద్దరూ కలిసి జీవించాలన్నదే నా విన్నపం అని చెప్పాడు.

12 మందితో డేటింగ్.. ఒకరితో పెళ్ళి.. చివరకు ఒంటరిగా మిగిలిన హీరోయిన్....

Dhanush

ధనుష్  ఎఫైర్ల రూమర్స్ వల్ల వీరు విడాకులు తీసుకుంటున్నారని ప్రచారం జరిగింది. అయితే ఇది నిజమైతే.. ధనుష్ కూడా మారాల్సి అవసరం ఉంది అన్నట్టుగామాట్టాడారు రాజన్. తమిళ సంసృతిని కాపాడాలి అని మీకు అనిపిస్తే.. దయచేసి కలిసిపోండి విడాకులు తీసుకోకండి అంటూ రాజన్ వేడుకున్నారు. ఇలా సూటిగా మాట్లాడకూడదు అనుకున్నాను. కాని నా మనసు ఒప్పుకోలేదు అంటూ కామెంట్లు చేశారు రాజన్. 

ప్లాప్ సినిమాతో రవితేజ రికార్డ్ , మాస్ మహారాజ్ కు అక్కడ అంత ఇమేజ్ ఉందా..?

ఇక ధనుష్ - ఐశ్వర్యల విడాకులపై ఇప్పటికీ రకరకాల కామెంట్లు వినిపిస్తున్నారు. వీరిద్దరు 2004లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు లింగ, యాత్ర అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. దాదాపు 18 ఏళ్లుగా హ్యాపీగా  వైవాహిక జీవితాన్ని గడిపిన వీరి మధ్య  ఒక్కసారిగా విభేదాలు రావడంతో 2022లో విడాకులు తీసుకుంటున్నట్లు ధనుష్, ఐశ్వర్య ఇద్దరూ సంయుక్తంగా ప్రకటించారు.

ధనుష్-ఐశ్వర్యల ఈ ప్రకటన వారి కుటుంబాలనే కాకుండా మొత్తం  ఫిల్మ్ ఇండస్ట్రీకే షాక్ ఇచ్చింది. తమిళ సినిమాను అయితే   దిగ్భ్రాంతికి గురి చేసింది.  అయితే వీరి నిర్ణయంపై  ఇరు కుటుంబాల వారు మాట్లాడి.. విడాకులు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి అని ఎంత ప్రదేయ పడినా.. చర్చలు ఫలించలేదు. వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే వారి ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇద్దరూ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు.
 

 వీరి విడాకులకు సబంధించి  కోర్ట్ లో కూడా ప్రోసీజర్ నడుస్తోంది. ఇద్దరు హాజరు కావల్సిందిగా రీసెంట్ గా కోర్టు నుంచి నోటీస్లు కూడా అందాయి. ఇక త్వరలో చట్ట పరంగా కూడా వీరు విడిపోబోతున్నారు. ఈ విషయంలో అటు ధనుష్ ఫ్యాన్స్ తో పాటు.. రజినీకాంత్ ఫ్యాన్స్ కూడా చాలా బాధపడుతున్నారు. 

click me!