గతంలోనే ధనుష్ రూ.25 కోట్లతో పోయిస్ గార్డెన్ లో స్థలం కొనుగోలు చేయగా.. 2021 ఫిబ్రవరిలో ఇంటి నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి అప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్, ఐశ్వర్య, కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. ఆ తర్వాత కొన్నాళ్లకే ధనుష్ - ఐశ్వర్య విడిపోయారు. కానీ ఇంటి నిర్మాణాన్ని మాత్రం ఆపలేదు.