పెళ్లి వార్తలు, ట్రోల్స్ పై తమన్నా షాకింగ్‌ రియాక్షన్‌.. అప్పుడు డాక్టర్‌, ఇప్పుడు బిజినెస్‌ మ్యాన్‌..

First Published Dec 6, 2022, 4:26 PM IST

మిల్కీ బ్యూటీ తమన్నా గ్లామర్‌ ట్రీట్‌ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఆమె ఇంటర్నెట్‌లోకి వచ్చినా, ప్రమోషన్స్ లో పాల్గొన్నా అభిమానులకు పండగే. తాజాగా బ్యాక్‌ టూ బ్యాక్‌ హాట్‌ ట్రీట్‌తో అదరగొడుతుంది. మరోవైపు పెళ్లి వార్తలు, ట్రోల్స్ పై రియాక్ట్ అయ్యిందీ పాలరాతి బొమ్మ. 
 

తమన్నా(Tamanna) లేటెస్ట్ గా తన అందాలతో ఆకట్టుకుంటుంది. ఆమె బ్లూ కలర్‌ డ్రెస్‌ వేసి పరువాల విందు వడ్డించింది. పొట్టిదైన దుస్తుల్లో తన థైస్‌ అందాలతో కనువిందు చేస్తుంది. ఇంటర్నెట్‌లో లేటెస్ట్ ఫోటో షూట్‌ పిక్స్ తో రచ్చ చేస్తుంది. నెటిజన్లని అలరిస్తుంది. సూపర్‌ హాట్‌ పోజులతో మెస్మరైజ్‌ చేస్తుంది. 
 

ఇదిలా ఉంటే ఇటీవల తమన్నా(Tamannaah Hot Photos) మ్యారేజ్‌కి సంబంధించిన వార్తలు వైరల్‌గా మారిన విషయంతెలిసిందే. ముంబయికి చెందిన ఓ వ్యాపారిని ఆమె వివాహం చేసుకోబోతుందని, త్వరలోనే మ్యారేజ్‌ ఉండబోతుందనే వార్తలు నెట్టింట గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై తమన్నా స్పందించింది. ఈ వార్తలపై ఆమె రియాక్షన్‌ ఆశ్చర్యపరిచేలా ఉండటం విశేషం. 
 

పెళ్లి రూమర్స్ ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. ఇప్పటికే చాలా సార్లు వచ్చాయి. అంతకు ముందు ఓ డాక్టర్‌ని పెళ్లి చేసుకుందన్నారు. మ్యారేజ్‌ కూడా సెట్‌ చేశారు. ఇప్పుడు బిజినెస్‌మ్యాన్‌తో మ్యారేజ్‌ అంటున్నారు. నటిగా మాకు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. కానీ అందులో ఏమాత్రం నిజం లేదు. పూర్తిగా రూమర్స్. పెళ్లి విషయంలో హడావుడి లేదు. పేరెంట్స్ వైపు నుంచి కూడా ఫోర్స్ లేదు. నచ్చిన అబ్బాయి తారసపడినప్పుడు మ్యారేజ్‌ గురించి ఆలోచిస్తామని తెలిపింది. 

పెళ్లి ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఓ గొప్ప మూవ్‌మెంట్‌. నా జీవితంలోనూ అది అందమైన భాగం. లవ్‌, పెళ్లి జీవితంలో బిగ్గెస్ట్ షోకేస్‌. ఆ విషయంలో తొందరపడటం లేదు. అయితే ఇటీవల పెళ్లి చేసుకున్న హన్సిక విషయంలో తాను సంతోషంగా ఉన్నానని తమన్నా వెల్లడించింది. 
 

ఈ సందర్భంగా ట్రోల్స్, మీమ్స్ పైనూ ఆమె రియాక్ట్ అయ్యింది. తనపై వచ్చే విమర్శలను తాను పట్టించుకోను అని తెలిపింది. తాము పబ్లిక్‌ ఫిగర్స్. తాము అందరికి నచ్చాలని లేదు. రకరకాల కామెంట్లు వస్తుంటాయి. వాటిని అస్సలు పట్టించుకోను. అయితే వాటిని చూసి ఎంజాయ్‌ చేస్తాను. అంతేకానీ వాటిని ఏమాత్రం సీరియస్‌గా తీసుకోను అని స్పష్టం చేసింది తమన్నా. 

తమన్నా.. సత్యదేవ్‌తో కలిసి నటించిన `గుర్తుందా శీతాకాలం` (Gurtunda seetakalam) చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఆమె మంగళవారం మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా అనేక ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇది రీమేక్‌ సినిమా అయినా, లవ్‌ స్టోరీ కొత్తగా ఉంటుంది. ఓ కొత్త అనుభూతిని కలిగిస్తుంది. తాము ఆ ఫీల్‌ అయ్యామని, రేపు ఆడియెన్స్ కూడా అదే ఫీల్‌కి గురవుతారని వెల్లడించారు. గతంలో మాదిరిగా ఇందులో గ్లామరస్‌ డాన్సులు ఉండవని చెప్పింది. ఇరికించి వాటిని పెట్టలేమని, అలాంటి పాటలు ఇంతకు ముందే పెద్ద హీరోలతో చేశానని పేర్కొంది తమన్నా. 
 

తెలుగులో ప్రస్తుతం చిరంజీవితో `భోళా శంకర్‌` చిత్రంలో నటిస్తుంది. జనవరిలో తాను షూటింగ్‌లో పాల్గొంటానని పేర్కొంది. మలయాళంలోకి ఎంట్రీ ఇస్తూ దిలీప్‌తో ఓ సినిమా చేస్తున్నానని పేర్కొంది. త్వరలోనే తన నుంచి మూడు ఓటీటీ ఫిల్మ్స్ విడుదల కాబోతున్నాయని పేర్కొంది. భాషలతో పనిలేదని, మంచి సినిమాలు ఎక్కడ వస్తే అక్క నటిస్తానని తెలిపింది. రెగ్యూలర్‌ మూవీస్‌ చేయాలనుకోవడం లేదని పేర్కొంది. కొత్తగా, ఎగ్జైటింగ్‌గా అనిపించేవే చేస్తానని పేర్కొంది తమన్నా. 
 

click me!