పాజిటివ్ టాక్ నేపథ్యంలో స్క్రీన్స్, షోలు పెంచుతామని ఆదివారం చిత్ర యూనిట్ తెలియజేసింది. తాజాగా మహేష్ బాబు ఈ సినిమా పై ట్వీట్ చేశారు. నిహారికకు కంగ్రాట్స్ తెలిపారు. '' కమిటీ కుర్రోళ్ళు గురించి చాలా మంచి విషయాలు వింటున్నా. సినిమా నిర్మాణంలోకి అడుగు పెట్టి, తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్నందుకు కంగ్రాట్స్ నిహారిక. టోటల్ టీమ్ కు శుభాకాంక్షలు. త్వరలో ఈ చిత్రాన్ని చూస్తా '' అని మహేష్ బాబు ట్వీట్ చేశారు.