మహేష్ ఎమోషనల్ కామెంట్స్.. త్రివిక్రమ్ పంచ్ లు, శ్రీలీల డాన్స్.. గుంటూరు కారం ప్రీరిలీజ్ హైలెట్స్ ఇవే..

First Published Jan 9, 2024, 10:56 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం ప్రీరిలీజ్ ఈవెంట్  గుంటూరులో ఘనంగా జరిగింది. భారీ ఎత్తున అభిమాన సందోహం నడుమ ప్రీరిలీజ్ వేడుక అట్టహాసంగాజరిగింది. 
 

ఈ ఈవెంట్ లో అదరిపోయే లుక్ లో కనిపించారు సూపర్ స్టార్ మహేష్ బాబు. చెక్ షర్ట్ లో హ్యాడ్సమ్ లుక్ లో కనిపించారు. ఇక  ఈసందర్భంగా  ఎమోషనల్ స్పీచ్ కూడా ఇచ్చారు సూపర్ స్టార్ మహేష బాబు. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ తన సినిమాల గురించి మాట్లాడేవారని.. రివ్యూ ఇచ్చేవారని.. కాని ఇప్పుడు నాకు తల్లీ తండ్రీ.. అన్నీ మీరే.. అంటూ ఎమోషనల్ అయ్యారు మహేష్. అంతే కాదు ఈసినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఆదరించండి అంటూ చేతులెత్తి దండం పెట్టారు మహేష్. 
 

ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి చాలా నేర్చుకోవచ్చు.. ఆయన నా కుటుంబ సభ్యులు.. ఆయన గురించి నేను ఎక్కడా మాట్లాడలేదు.. ఎందుకంటే..ఫ్యామిలీ మెంబర్ గురించి ఏం మాట్లాడుతాం.. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కవే అన్నారు మహేష్. ఇక శ్రీలీల నటన అద్భుతం అన్నారు మహేష్. ఆమెతో డాన్స్ అంటే.. అమ్మో.. హీరోల తాట ఊడిపోతుంది అంటూ నవ్వులు పూయించారు సూపర్ స్టార్. 

Latest Videos


ఇక ఈవెంట్ లో మాట్లాడిన త్రివిక్రమ్.. మహేష్ బాబు ను 20 ఏళ్ళ నుంచి చూస్తున్నా.. ఆయన ఇప్పటికీ కుర్రాడిలాగే ఉన్నారు. ఆయన నటన కూడా యవ్వనంగా ఉంది అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. అతడు,ఖలేజా సినిమాలటైమ్ లో ఎలా ఉన్నారో మహేష్ ఇప్పటికీ అలాగేఉన్నారంటూ త్రివిక్రమ్ కితాబిచ్చారు. సంక్రాంతికి ఈసినిమా తప్పక చూడాలన్నారు. 
 

ఇక ఈ ఈవెంట్ లో మెరుపులు మెరిపించింది శ్రీలీల. అదిరిపోయే లుక్ లో కనిపిండంతో పాటు.. కుర్చీ పాటకు తమన్ తో కలిసి స్టెప్పులేుసింది. ఆమె మాట్లాడుతూ.. తాను జీవితంలో మహేష్ పక్కన నటిస్తానని అనుకోలేదని చెప్పింది. ఎక్కడోఆడియన్స్ లో మీ ఫ్యాన్ గా ఉండాల్సిన నేను.. మీతో కలిసి నటించడం నమ్మలేకపోతున్నా అన్నారు శ్రీలీల. ఇక త్రివిక్రమ్ సర్ ఓ లైబ్రెరీ, ఆయన మాటలు మెస్మరైజింగ్ గా ఉంటాయి. అన్నారు. 

ఈ ఈవెంల్ లో నిర్మాత దిల్ రాజు కూడా పాల్లొన్నారు.. సినిమా బాక్సాఫీస్ ను శేక్ చేస్తుందన్నారు. తనదైన డైలాగ్స్ తో అదరగొట్టారు దిల్ రాజు. ఇక `కుర్చీ మడత పెట్టి` సాంగ్‌ సినిమాలో హైలైట్‌గా ఉంటుందని, ఆ పాటకి మహేష్‌, శ్రీలీల చేసే డాన్సులకు స్క్రీన్లు చిరిగిపోతాయన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కలెక్షన్ల తాట తీస్తారని అన్నారు దిల్ రాజు. ఈమధ్య సినిమా రిలీజ్ ల విషయంలో దిల్ రాజు వివాదంగా మారిన సంగతి తెలిసిందే.. 

ఇక గుంటూరు కారం ప్రీరిలీజ్ ఈవెంట్ రసాభస అయ్యింది. ఫ్యాన్స్ కుర్చీలు మడతపెట్టి మరీ కొట్టుకోవడం..తొక్కిసలాట జరగడంతో.. పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. అంతే కాదు 5000 మంది కోసం పాసులు రిలీజ్ చేసి..  20 వేల మందికి పైగా అందులోకి అలో చేయడంతో.. అంతా గందరగోళం ఏర్పడింది. అభిమానులను కంట్రోల్ చేయడం పోలీసులకు కూడా సాధ్యం కాలేదు. దాంతో ఈవెంట్ ను స్పీడ్ గా కంప్లీట్ చేశారు నిర్వాహకులు. 
 

click me!