పా రంజిత్‌ సినిమా షూటింగ్‌లో విషాదం.. ప్రముఖ స్టంట్‌ మాస్టర్‌ కన్నుమూత

Published : Jul 14, 2025, 01:00 PM IST

కోలీవుడ్‌ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు పా రంజిత్‌ రూపొందిస్తున్న కొత్త మూవీ షూటింగ్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో స్టంట్‌ మాస్టర్ కన్నుమూశారు. 

PREV
15
పా రంజిత్‌ సినిమా షూటింగ్‌లో ప్రమాదం

సినిమా షూటింగ్స్ లో విపత్తులు తరచుగా జరుగుతున్నాయి. ఇప్పుడు పా. రంజిత్ దర్శకత్వంలో వస్తున్న ఇటీవల సినిమా సెట్లలో ప్రమాదాలు జరుగుతున్నాయి.

 ప్రస్తుతం దర్శకుడు పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న `వెట్టువం` మూవీ సెట్‌లో  స్టంట్ మాస్టర్‌ మోహన్‌ రాజ్‌ కన్నుమూశారు.  

దర్శకుడు పా రంజిత్ `అట్టకత్తి` చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు.  `మద్రాస్` , సూపర్ స్టార్ రజనీకాంత్ తో `కబాలి`, `కాలా `చిత్రాలను దర్శకత్వం వహించి దర్శకులలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.

25
ఆర్య, అట్టకతి దినేష్‌, కలైయరసన్‌ స్టార్స్ గా `వెట్టువం` సినిమా

రీసెంట్ గా `తంగలాన్` సినిమా తీసిన రంజిత్, ఇప్పుడు `వెట్టువం` సినిమా తీస్తున్నారు. ఆర్య, అట్టకతి దినేష్, కలైయరసన్ వంటి నటులు నటిస్తున్న ఈ సినిమాను నీలం ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.

35
కార్‌ ఛేజింగ్‌ స్టంట్‌ చేస్తూ మోహన్‌ రాజ్‌ కన్నుమూత

నాగపట్నం జిల్లాలో షూటింగ్ జరుగుతున్న సమయంలో సీనియర్ స్టంట్ మాస్టర్ మోహన్ రాజ్ (52) కన్నుమూశారు. కార్‌ ఛేజింగ్‌కి సంబంధించిన స్టంట్స్ చేస్తున్న సమయంలో చోటు చేసుకున్న ప్రమాదంలో రాజ్‌ మృతి చెందడం విచారకరం. 

45
గుండెపోటుగా ప్రకటించిన చిత్ర బృందం

అయితే మొదట చిత్రం బృందం మోహన్‌ రాజా గుండెపోటుతో మరణించినట్టు తెలిపింది. స్టంట్‌ చేసే క్రమంలో ఆయనకు గుండెపోటు వచ్చిందని, దీంతో ఆసుపత్రికి తరలించారని, కానీ ఆసుపత్రికి వెళ్లే లోపు ఆయన మరణించినట్టు తెలిపారు. 

55
అక్కడికక్కడే మోహన్‌ రాజ్‌ మృతి చెందినట్టు వీడియో వైరల్‌

కానీ వీడియోలో వేరేలా ఉంది. ఈ వీడియోలో కార్‌ ఛేజింగ్‌ సీన్‌ చిత్రీకరిస్తున్నారు. రోప్‌ పై నుంచి కారు వెళ్లి బోల్తా కొట్టింది. సీన్‌ ముగిసిన వెంటనే టీమ్‌ ప్రమాదం వద్దకు వెళ్లి చూడగా, ఆయన మృతి చెందినట్టు తెలిసింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories