పూజ హెగ్డే బెస్ట్ స్టన్నిగ్ లుక్స్,చూస్తే కళ్లు తిప్పుకోలేరు

First Published Oct 13, 2020, 7:00 PM IST

 స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే పుట్టిన రోజుని టాలీవుడ్ గ్రాండ్ గా జరుపుతోంది. ఈ సందర్భంగా ఆమెకు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా  విషెష్ తెలుపుతున్నారు. మరోవైపు ఆమె 30వ జన్మదినాన్ని పురస్కరించుకొని.. పూజా కొత్త సినిమాల్లోని కొత్త పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా నేటి ఉదయం `రాధే శ్యామ్` మూవీ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేయగా.. తాజాగా ఆమె మరో న్యూ మూవీ `మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్` నుంచి కూడా పూజా లుక్‌తో కూడిన పోస్టర్‌ విడుదల చేశారు.బాక్సాఫీస్‌ను కలకలలాడించే జిగేలు రాణి గా పేరు తెచ్చుకున్న ఆమె.. తన అందంతో వెండితెరపై వెన్నెల పూయించే అరవిందగా వెలిగిపోతోంది. మోడలింగ్ రంగం నుంచి వెండితెర మీద అడుగుపెట్టిన ఈ తరం శ్రీదేవి అని అందరూ మెచ్చేసుకుంటున్నారు.ఈ అందాల భామ పుట్టిన రోజు నేడు(అక్టోబర్ 13). ఈ పుట్టిన రోజు పూజకు ఎంతో స్పెషల్‌. అందుకే ఆమెను గుర్తు చేసుకుంటూ ఆమె అందాలను మరోసారి కనులారా వీక్షిద్దాం.
 

తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్‌ ఎలిజబుల్‌ హీరోయిన్లుగా .. మొదటగా వినిపించే పేర్లలో పూజ హెగ్డే ఒకరు.
undefined
అల్లు అర్జున్ తో చేసిన ‘అల వైకుంఠపురములో’తో ఈ ఏడాది భారీ హిట్‌ కొట్టింది పూజ. ఆ తర్వాత వరుస సినిమాలు సంతకం చేసేస్తుంది అనుకున్నారు.
undefined
అయితే కరోనా-లాక్‌డౌన్‌ కారణంగా ఆమె కొత్త సినిమాలేవీ పట్టాలెక్కలేదు. అయితే, ఆమె ఇంటి పట్టున ఉంటూ వర్కవుట్స్ చేస్తూ తన అందం పెంచుకునే పనిలో ఉంది.
undefined
దాదాపు ఆరు నెలలు తర్వాత షూటింగ్ కు రెడీ అయ్యింది. ఈక్రమంలో తనెలా ఉన్నానో ..ఓసారి తన సెక్సీనెస్ ని ఇలా ఆరబోస్తూ ఫోస్ ఇచ్చింది.
undefined
మోడలింగ్ రంగంలో సత్తా చాటిన పూజ తరువాత టెలివిజన్‌ కమర్షియల్స్‌తో దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు తెలుగు, హిందీ భాషల్లో బిజీగా ఉంది.
undefined
ఈ భామ వెండితెరకు పరిచయం అయ్యింది మాత్రం తమిళ ఇండస్ట్రీ నుంచి. 2012లో రిలీజైన మూగముడి సినిమాతో తెరంగేట్రం చేసింది పూజా. ఆ తరువాత ఇంతవరకు కోలీవుడ్లో మరో సినిమా చేయలేదు.
undefined
ప్రస్తుతం పూజ వరస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇప్పటికే అంగీకరించిన ప్రభాస్‌తో ‘రాధే శ్యామ్‌’, అఖిల్‌తో ‘మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌’ సెట్స్‌పై ఉన్నాయి.
undefined
పూజ హెగ్డే ప్రస్తుతం టాప్ గేర్ లో దూసుకుపోతున్న నెంబర్ వన్ హీరోయిన్ అనటంలో సందేహం లేదు. పూజ తో పోటీ పడుతున్న రశ్మిక సరిలేరు నీకెవ్వరూ సినిమా హిట్ అయింది. దాంతో అంతా రష్మిక టాప్ అన్నారు. కానీ పూజ హవా చూస్తూంటే మళ్ళీ పూజానే టాప్.
undefined
వరుసగా పెద్ద సినిమాలున్నాయన్నా ఆలోచన వల్లనో లేక, ‘అల వైకుంఠపురములో’ ఇచ్చిన కిక్ వల్లనో కానీ, పూజ పారితోషికం పెంచేసిందట.
undefined
‘అల వైకుంఠపురములో’కు పూజా హెగ్డే ₹1.4 కోట్లు తీసుకుందని టాలీవుడ్‌ వర్గాల టాక్‌. ఇప్పుడు ఆమె తన పారితోషికాన్ని రూ. రెండు కోట్లకు పెంచేసిందని తెలుస్తోంది.
undefined
ఇప్పటి వరకు పూజ తీసుకున్న అత్యధిక పారితోషికం బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ సినిమా ‘సాక్ష్యం’ కోసమే. ఆ సినిమాకు సుమారు రూ.కోటిన్నర ఇచ్చారని అప్పట్లో వార్తలొచ్చాయి.
undefined
ఆ తర్వాత ‘అల వైకుంఠపురములో’ వరకు ఆమె అంగీకరించిన సినిమాలకు రూ.కోటికి అటుఇటుగానే తీసుకుందట.
undefined
ఇప్పుడు పూజ ఎందుకు పారితోషికం పెంచింది అంటూ కొంతమంది ఆలోచిస్తుంటే... దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఫేమ్‌ ఉన్నప్పుడు పారితోషికం తీసుకోవాలి అని ఇంకొందరు అంటున్నారు
undefined
ఇంతవరకూ బాగున్నా కరోనా సమయంలో పారితోషికాలు తగ్గించుకోవడానికి కొంతమంది నటీనటులు నిర్ణయాలు తీసుకుంటున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో పూజ పారితోషికం పెంచేసింది అంటూ వార్తలు రావడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది.
undefined
సల్మాన్‌ ఖాన్‌ నటించబోతున్న ‘కబి ఈద్‌ కబి దివాళి’ సినిమాలో పూజా హెగ్డే కథానాయిక పాత్ర పోషించబోతున్నారు.
undefined
మంగళవారం ఆమె పుట్టిన రోజు సందర్భంగా పూజా లుక్‌ను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఇందులో పూజా డ్రెస్సింగ్‌ స్టైల్‌ కూడా అలాగే ఉంది. రైలులో ప్రయాణిస్తూ చిరు నవ్వులు చిందిస్తున్న పూజా ఫొటో అభిమానులను అలరిస్తోంది.
undefined
ఇందులో పూజా ‘ప్రేరణ’ అనే పాత్రలో నటిస్తోంది. మరోవైపు ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు వచ్చింది. ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా అతి తక్కువమంది బృందంతో చిత్రీకరణ జరుపుతున్నట్లు సమాచారం.
undefined
అఖిల్‌ కథానాయకుడు బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. పూజా హెగ్డేకు జన్మదినం శుభాకాంక్షలు చెబుతూ, ఈ చిత్ర బృందం కూడా ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది.
undefined
హీరోలతో పోల్చితే హీరోయిన్స్ సినీ కెరీర్‌ ఎప్పుడూ వేగంగా సాగిపోతుంటుంది. హీరోలు ఓ కథను ఎంచుకోవాలంటే వాళ్ల ఇమేజ్‌ మొదలుకొని, అభిమానుల ఆలోచనల వరకు చాలా విషయాల్ని లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే వాళ్లు ఒక్కో చిత్రానికి ఏడాదికి పైగా వెచ్చించాల్సి వస్తుంటుంది. కథానాయికలకు ఇలాంటి ఇబ్బందులు పెద్దగా ఉండవు.
undefined
మంచి కలయికను చూసుకొని రంగంలోకి దిగిపోతుంటారు. అందుకే ఏడాదికి నాలుగైదు చిత్రాలైనా అలవోకగా చేసేస్తుంటారు. అయితే కరోనా పరిస్థితుల తర్వాత వీరి వేగం మందగిస్తుందేమోనన్న అనుమానాలు మెదిలాయి.
undefined
కానీ, చిత్రీకరణలు పునః ప్రారంభం కాగానే ముద్దుగుమ్మలంతా ధైర్యంగా సెట్స్‌లోకి అడుగుపెట్టి ఆ అనుమానాల్ని పటాపంచెలు చేశారు. చేతిలో ఉన్న చిత్రాల్ని చకచకా చుట్టేస్తూ.. మునుపటిలా జోరు చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
undefined
‘అల.. వైకుంఠపురములో’ సినిమాతో చక్కటి విజయాన్ని ఖాతాలో వేసుకుంది పూజా హెగ్డే. ఇప్పుడీ బుట్ట బొమ్మ వరుస షూటింగ్‌లతో తీరిక లేకుండా గడిపేస్తోంది. ఇటీవలే యువ హీరో అఖిల్‌తో కలిసి ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ చిత్రాన్ని పూర్తి చేసిన ఆమె.. ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’ కోసం యూరోప్‌కి చేరుకుంది. దీని షూటింగ్‌ ఈ వారంలోనే ఇటలీలో పునఃప్రారంభం కానున్నట్లు సమాచారం.
undefined
లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ నుంచి బ్రేక్‌ దొరకడంతో పూజా ముంబయి చేరుకుని కుటుంబసభ్యులతో కలిసి సరదాగా గడిపారు. చెఫ్‌గా మారి ఎన్నో ప్రత్యేకమైన వంటకాలు తయారుచేసి ఇంటిల్లిపాదికి రుచి చూపించారు.
undefined
షూటింగ్‌లు చేసుకునేందుకు ప్రభుత్వాలు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో పూజా తన తదుపరి సినిమా పనుల్లో బిజీ అయ్యారు.
undefined
ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా అతి తక్కువమంది బృందంతో వచ్చేవారం నుంచి ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుందని, దీంతో త్వరలోనే ప్రభాస్‌-పూజా కలిసి సెట్‌లో అడుగుపెట్టనున్నారంటూ సోషల్‌మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
undefined
రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న వింటేజ్‌ ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్‌’. ఇప్పటికే 70 శాతం వరకూ షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో అలనాటి తార భాగ్యశ్రీ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు.
undefined
లాక్‌డౌన్‌కి ముందు జార్జియాలో జరిగిన షూటింగ్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. జార్జియా షెడ్యూల్‌లో ప్రభాస్‌, పూజాహెగ్డే, భాగ్యశ్రీ, ప్రియదర్శి పాల్గొన్నారు. మరోవైపు పూజా అఖిల్‌తో కలిసి ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ చిత్రంలో సందడి చేయనున్నారు.
undefined
‘ఈ సినిమా చర్చల దశ ముగిసిన తర్వాత.. హీరోయిన్ గా నన్ను తీసుకున్నారని సమాచారం వచ్చింది. ఆ సమయంలో ఎంతో సంతోషంగా అనిపించింది. సల్మాన్‌తో కలిసి పనిచేయడం కోసం ఎదురుచూస్తున్నా’ అని బుట్టబొమ్మ పేర్కొన్నారు.
undefined
అయితే ప్రస్తుతం అల్లు అర్జున్, ప్రభాస్, అఖిల్ అంటూ దూసుకుపోతున్న ఈ ముద్దగుమ్మకి ఎలాంటి అబ్బాయి కావాలో చెబుతుంది. అంటే పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఇప్పుడే లేదనుకోండి అంటోంది.
undefined
కానీ పూజ కి ఇష్టమైన రెండు పనులు చేస్తే ఇట్టే పడిపోతుందట. చాలామంది అమ్మాయిలను ఇంప్రెస్స్ చెయ్యడానికి నానా కష్టాలు పడుతుంటారు. కానీ పూజకు అవేమీ అవసరం లేవట.
undefined
click me!