ఖైదీ చిత్రంలో రగులుతోంది మొగలి పొద అనే సాంగ్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సాంగ్ ని చిరు, మాధవి మధ్య రొమాన్స్ కోసమే పెట్టారా అనే ప్రశ్నకు డైరెక్టర్ సమధానం ఇచ్చారు.
తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ ఒకటి. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సాధారణ చిరంజీవిని టాలీవుడ్ శిఖరాగ్రాన నిలబెట్టింది. ఈ సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా మరికొన్ని విశేషాలు మిగిలే ఉంటాయి. డైరెక్టర్ కోదండ రామిరెడ్డి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
25
సూపర్ స్టార్ కృష్ణ నటించాలి కానీ..
ఖైదీ సినిమా చేయాలనుకున్నప్పుడు కృష్ణ గారితో చర్చలు జరిగాయి. కానీ సబ్జెక్టు విషయంలో ఏకాభిప్రాయం కుదర్లేదు. దీనితో హీరోగా ఎవరిని తీసుకోవాలి అని నేను, నిర్మాత తిరుపతి రెడ్డి చర్చించుకుంటున్నాం. మేమంతా నెల్లూరు వాళ్ళాం. అప్పుడు చిరంజీవి ఫ్యామిలీ కూడా నెల్లూరులోనే ఉంటున్నారు. అంతకు ముందే చిరంజీవితో న్యాయం కావాలి, అభిలాష లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చేశాను.
35
మా తలరాత మారిపోయింది
దీనితో వెంటనే చిరంజీవిని ఫైనల్ చేసినట్లు కోదండరామిరెడ్డి తెలిపారు. ఆ విధంగా ఖైదీ చిత్రం మా అందరి తలరాతని దెబ్బకు మార్చేసింది. నేను, చిరంజీవి ఒక్కసారిగా టాలీవుడ్ లో చాలా పెద్ద సెలెబ్రిటీస్ అయిపోయినట్లు కోదండరామిరెడ్డి తెలిపారు.
ఈ సినిమా విషయంలో ప్రతిదీ వైవిధ్యంగా ప్రయత్నిస్తూ వచ్చాం. మేము చేసిన ప్రయత్నాలు అన్నీ సూపర్ సక్సెస్ అయ్యాయి. చిరంజీవి బ్లాక్ బనియన్ ధరించి పోస్టర్ మాత్రమే వదిలాం. ఆ ఒక్క పోస్టర్ తోనే దాదాపు అన్ని థియేటర్స్ లో ఈ చిత్రం సంవత్సరం ఆడింది.
55
రగులుతోంది మొగలి పొద సాంగ్
ఈ చిత్రంలో రగులుతోంది మొగలి పొద అనే సాంగ్ ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సాంగ్ ని చిరంజీవి, మాధవి మధ్య రొమాన్స్ కోసమే పెట్టినట్లు అనుకుంటారు. కానీ మా ఉద్దేశం అది కాదు. ఈ సినిమాలో పాటలు రెగ్యులర్ గా డ్యూయెట్ తరహాలో ఉండకూడదు అని మేము ముందే అనుకున్నాం. అద్భుతమైన కాస్ట్యూమ్స్ తో డ్యాన్స్ చేయిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన నుంచి రగులుతోంది మొగలిపొద సాంగ్ వచ్చినట్లు కోదండరామిరెడ్డి అన్నారు.