కాగా మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై మరో క్రేజీ వార్త తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో విలన్ గా ఓ స్టార్ హీరో కొడుకు నటిస్తున్నాడట. ఆయనెవరో కాదు ధృవ్ విక్రమ్. కోలీవుడ్ స్టార్ విక్రమ్ కుమారుడైన ధృవ్ పరిశ్రమకు వచ్చి ఐదేళ్లు దాటిపోయింది. ఆదిత్య వర్మ, మహాన్ చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం బైసన్ పేరుతో ఒక చిత్రం చేస్తున్నాడు.
ధృవ్ ని దర్శకుడు ప్రశాంత్ వర్మ విలన్ రోల్ కోసం సంప్రదించాడట. సబ్జెక్టు నచ్చడంతో ధృవ్ పచ్చజెండా ఊపాడట. మోక్షజ్ఞ-ధృవ్ సిల్వర్ స్క్రీన్ పై తలపడటం ఖాయం అంటున్నారు. ఈ మేరకు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.