`ఎస్ఎస్ఎంబీ29` సినిమా ప్రకటన త్వరలోనే ఉండబోతుందట. అంతర్జాతీయ వేదికపై, అంతర్జాతీయ మీడియా ముందు దీన్ని అనౌన్స్ చేయబోతున్నారట. దీనికి హాలీవుడ్ దిగ్గజాలు జేమ్స్ కామెరూన్, స్టీవెన్ స్పీల్బర్గ్ లను ఆహ్వానించాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ మూవీకి `మహారాజా`, `చక్రవర్తి`అనే పేర్లని పరిశీలిస్తున్నారట. ఇక ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించబోతున్నారు. పీఎస్ వినోద్ కెమెరామెన్గా, తమ్మిరాజు ఎడిటర్గా, మోహన్ నాథ్ బింగిని ప్రొడక్షన్ డిజైనర్గా, కమల్ కన్నన్ టీమ్ వీఎఫ్ఎక్స్ వర్క్ చూసుకోబోతుందని సమాచారం. కె ఎల్ నారాయణ ఈ మూవీని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.