తన మానసిక సమస్యల్ని బయటపెట్టిన శృతి హాసన్.. ట్రీట్మెంట్ కూడా తీసుకుంటోందట.. ఇంతకీ ఏమైంది?

First Published Jan 12, 2023, 4:28 PM IST

స్టార్ హీరోయిన్ శృతి హాసన్ (Shruti Haasan) కొద్ది రోజులుగా మానసిక సమస్యలతో బాధపడుతోంది. ఇందుకు సంబంధించిన చికిత్స కూడా పొందుతోంది. ఇంతకీ తన ఆరోగ్యానికి ఏమైందంటూ ఫ్యాన్స్ ఆందోళన పడుతుండగా క్లారిటీ ఇచ్చింది.
 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ (Shruti Haasan) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సౌత్ లో అగ్ర స్థాయి హీరోయిన్ గా దూసుకుపోతోంది. ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటోందీ బ్యూటీ. ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించేందుకు సిద్ధంగా ఉంది.

అయితే, వరుసగా షూటింగ్ లకు హాజరవుతూ ఉన్న ఈ బ్యూటీ ఇటీవల కాస్తా మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టు తెలిపింది. రీసెంట్ గా తన ఆరోగ్యం బాగాలేదని శృతి హాసన్ స్వయంగా ఇన్ స్టాలో తెలిసిన విషయం తెలిసిందే. అందుకు ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాలేకపోయానని వివరించింది.
 

దీంతో ఆమె ఆరోగ్యానికి ఏమైందంటూ అభిమానులు ఆందోళన పడుతున్నారు. తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శృతి హాసన్ తన మెంటల్ హెల్త్ కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. కొద్ది రోజులుగా తను మానసిక సమస్యలతో సతమతం అవుతుతున్నట్టు తెలిపింది. 

ఉన్నట్టుండి ఉద్రేకమవడం, సహనాన్ని కోల్పోవడం,  కొన్ని సందర్భాల్లో తీవ్రమైన ఆశేశానికి గురవుతున్నట్టు తెలిపింది. ఇంట్లో అయినా, షూటింగ్ స్పాట్ లలోనైనా అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే విపరీతమైన కోపం వస్తుందని వెల్లడించింది. దీని నుంచి బయట పడేందుకు చికిత్స తీసుకుంటున్నాని.. ప్రస్తుతం పర్లేదని చెప్పింది.
 

ఇక ఈ ఏడాది శృతి హాసన్ అభిమానులకు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అందనుంది. బాలయ్య, చిరంజీవి ప్రభాస్ సరసన నటిస్తున్న స్టార్ బ్యూటీ ఏకంగా సంక్రాంతికే రెండు సినిమాలతో అలరిస్తోంది. ఈరోజు బాలయ్య ‘వీరసింహారెడ్డి’ విడుదలై దుమ్ములేపుతోంది. 

రేపు మెగా స్టార్ చిరంజీవి సరసన నటించిన మాస్ యాక్షన్ ఫిల్మ్  ‘వాల్తేరు వీరయ్య కూడా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే బాలయ్యతో హిట్ టాక్ అందుకున్న ఈ బ్యూటీ.. చిరుతోనూ మెప్పించనుందని అభిమానులు అభిప్రాపడుతున్నారు.  ఇక పాన్ ఇండియన్ స్టార్  ప్రభాస్ (Prabhas)తో ‘సలార్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈఏడాది సెప్టెంబర్ విడుదల కానుంది. 

click me!