దీనికి కారణం సినిమాపై భారీ హైప్ ఏర్పడింది. బయ్యర్లు షూటింగ్ దశలోనే సినిమాని కొనేందుకు వచ్చారు. హక్కుల కోసం పోటీ పడ్డారు. సినిమాపై హైప్ పెరిగింది, కానీ కథలో అంత దమ్ము కనిపించడం లేదు.
దీంతో దర్శకుడు కోదండరామిరెడ్డి శ్రీదేవితో ఈ విషయం చెప్పారు. ఆమెకి కూడా డౌట్ వచ్చింది. ఆ తర్వాత మరో సబ్జెక్ట్ తో చేద్దామనుకున్నారు. `మిస్టర్ ఇండియా` రీమేక్ అనుకున్నారు కానీ, అది చిరంజీవికి నచ్చలేదు.
ఇలా కొంత కాలం కథల కోసం వెయిట్ చేశారు. కానీ ఎక్కడా `జగదేక వీరుడు అతిలోక సుందరి` సినిమాని మించిన కథ దొరకలేదు. దీంతో మూవీని ఆపేశారు. అలా శ్రీదేవి నిర్మాతగా మారి చేసిన తొలి ప్రయత్నం ప్రారంభ దశలోనే ఆగిపోయింది.
ఆ తర్వాత మళ్లీ నిర్మాణం సైడ్ ఆలోచించలేదు శ్రీదేవి. ఈ మూవీ రూపొంది సక్సెస్ అయితే నిర్మాతగా శ్రీదేవి బిజీ అయ్యేది, ఇంకా అనేక చిత్రాలు నిర్మించేది.