శ్రీలీల వేదికపైకి వచ్చిన తర్వాత మంత్రిని వ్యక్తిగతంగా కలిసి జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత మంత్రి తన ప్రసంగాన్ని తిరిగి ప్రారంభిస్తూ, "ఇంకో హీరో మా వేదికలో చేరారు," అని వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యాంకర్ ఝాన్సీకి కనీసం సభా మర్యాద లేదా అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మంత్రి ప్రసంగిస్తున్న టైంలో శ్రీలీల వేదిక కింద కూర్చుని ఉన్నారు. మంత్రి ప్రసంగాన్ని అడ్డుకుని అర్జెంట్ గా శ్రీలీలని వేదికపైకి పిలవాల్సిన అవసరం ఏంటి ? కాసేపు ఎదురుచూస్తే ఏమవుతుంది అంటూ ఝాన్సీపై విమర్శలు చేస్తున్నారు.