నేను ఏడుస్తుంటే భుజం తట్టారు.. జీవితంలో కష్టాలు తలచుకుని శ్రీజ ఎమోషనల్

First Published Sep 22, 2022, 2:29 PM IST

మెగా డాటర్ శ్రీజ కొణిదెల గురించి చాలా కాలంగా రూమర్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ దేవ్, శ్రీజ ఇద్దరూ ప్రస్తుతం విడిగా ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై మెగా ఫ్యామిలీ స్పందించలేదు. 

మెగా డాటర్ శ్రీజ కొణిదెల గురించి చాలా కాలంగా రూమర్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ దేవ్, శ్రీజ ఇద్దరూ ప్రస్తుతం విడిగా ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై మెగా ఫ్యామిలీ స్పందించలేదు. శ్రీజ సోషల్ మీడియాలో కూడా కళ్యాణ్ దేవ్ గురించి ప్రస్తావన లేదు. 

ఒంటరిగా ఉన్న శ్రీజకి మానసిక ప్రశాంతత కల్పించేందుకు రాంచరణ్ ఆమెని తరచుగా వెకేషన్స్ కి తీసుకువెళ్లడం చూస్తూనే ఉన్నాం. ఇటీవల కూడా రాంచరణ్,సుస్మిత, శ్రీజ ముగ్గురూ రెస్టారెంట్ లో డిన్నర్ చేస్తూ కనిపించారు. శ్రీజ ఇటీవల విదేశాలకు వెకేషన్ కి వెళ్లిన ఫొటోస్ ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. 

అయితే ఆమె ఈ పోస్ట్ లో చేసిన ఎమోషనల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నా కష్టాల్లో సంతోషాల్లో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నేను కోపంగా ఉన్నప్పుడు భరించారు. ఏడుస్తున్నప్పుడు భుజం తట్టారు. నేను ఏం మాట్లాడినా ప్రేమతో విన్నారు. 

నిత్యం నా బాగోగులు తెలుసుకుంటూనే ఉన్నారు. నేను ఎలా ప్రవర్తించినా యాక్సెప్ట్ చేస్తూ వచ్చారు. నా పక్కన శిఖరంలాగా నిలబడి సపోర్ట్ ఇచ్చారు. ఇలాంటి కుటుంబం, స్నేహితులు దొరికినందుకు గర్వంగా ఉంది అంటూ శ్రీజ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. 

విదేశాల్లో అందమైన ప్రకృతి ప్రదేశాల్లో తీసుకున్న ఫొటోస్ ని శ్రీజ పోస్ట్ చేసింది. శ్రీజ వ్యక్తిగత జీవితం గురించి అందరికి తెలిసిందే. ప్రేమ వివాహం చేసుకున్న ఆమె మొదటి భర్త నుంచి విడిపోయింది. ఆ తర్వాత కళ్యాణ్ దేవ్ తో రెండవ వివాహం జరిగింది. 

శ్రీజకి ఇద్దరు ఆడపిల్లలు సంతానం. ఇంట్లో ఎలాంటి సెలెబ్రేషన్స్ జరిగినా శ్రీజ వెంటనే ఆ మధుర క్షణాలని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంది. శ్రీజ, చరణ్, సుస్మిత రెస్టారెంట్ లో డిన్నర్ చేస్తున్న పిక్ పై చిరంజీవి కూడా స్పందించారు. ఇలా పిల్లలంతా ఒకే చోట ఉంటే తల్లిదండ్రులకు వచ్చే సంతోషమే వేరు అని చిరంజీవి అన్నారు. 

click me!