శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం మృత్యుంజయ్ శుక్రవారం రోజు మార్చి 6న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. వరుసగా రొమాంటిక్ కామెడీ సినిమాలు చేసే శ్రీవిష్ణు ఈసారి క్రైమ్ థ్రిల్లర్ కథతో వస్తున్నాడు.
యంగ్ హీరో శ్రీవిష్ణు వారం గ్యాప్ లో రెండో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఫిబ్రవరి 27న శ్రీవిష్ణు నటించిన విష్ణు విన్యాసం చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఇది శ్రీవిష్ణు గత చిత్రాల లాగే రొమాంటిక్ కామెడీ జోనర్ లో తెరకెక్కింది. వారం గ్యాప్ లో మార్చి 6న శ్రీవిష్ణు నటించిన మరో చిత్రం రిలీజ్ అవుతోంది.
25
మృత్యుంజయ్ మూవీ
ఆ సినిమా పేరు మృత్యుంజయ్. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. సందీప్ గున్నం ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎప్పుడూ రొమాంటిక్ కామెడీ సినిమాలు చేసే శ్రీవిష్ణు ఈసారి క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో నటించాడు. ఈ కొత్త ప్రయత్నం శ్రీ విష్ణుకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
35
పాజిటివ్ రిపోర్ట్స్
అయితే ఈ చిత్రానికి వస్తున్న ఇన్ సైడ్ టాక్, ఎర్లీ రిపోర్ట్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. తాజాగా నేచురల్ స్టార్ నాని మృత్యుంజయ్ మూవీ స్పెషల్ షో చూశారు. అనంతరం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఈ చిత్రానికి రివ్యూ ఇచ్చారు. నాని ఇచ్చిన రివ్యూ చాలా పాజిటివ్ గా ఉంది.
నాని తన పోస్ట్ లో.. మృత్యుంజయ్ సినిమా చూస్తున్నంత సేపు ఎంజాయ్ చేశాను. ప్రారంభం నుంచి ఎండ్ వరకు ఎంగేజింగ్ గా అనిపించింది. శ్రీవిష్ణు కామిక్ రోల్స్ లో ఎలా చేస్తాడో మనందరికీ తెలుసు. కానీ ఈ సినిమా నాకు సర్ప్రైజ్ అనే చెప్పాలి. శ్రీ విష్ణు అద్భుతంగా చేశాడు.
55
చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు
సందీప్ గున్నంకి శుభాకాంక్షలు. నీవు తొలి ప్రయత్నంతోనే విజయం సాధించావు. చిత్ర యూనిట్ మొత్తానికి నా శుభాకాంక్షలు అని నాని తెలిపారు. ఇది థ్రిల్లర్ మూవీ కాబట్టి క్రిస్పీ రన్ టైంతో వస్తోంది. ఈ చిత్రానికి రన్ టైం 122 నిమిషాలు మాత్రమే. ఈ చిత్రం గురించి వస్తున్న ఇన్ సైడ్ రిపోర్ట్స్ కూడా పాజిటివ్ గా ఉన్నాయి. సీట్ ఎడ్జ్ పై కూర్చోబెట్టే థ్రిల్లర్ అని అంటున్నారు. మరి మృత్యుంజయ్ సినిమా ఏ రేంజ్ హిట్ అందుకుంటుందో వేచి చూడాలి.