Karthika deepam: ఇల్లు ఖాళీ చేసిన సౌందర్య, ఆనంద్ రావులు.. డాక్టర్ బాబును వెతుకుతున్న దీప!

First Published Aug 18, 2022, 7:32 AM IST

Karthika deepam:బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు ఆగస్ట్ 18వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం...
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... సౌందర్య, దీప ఫోటో చూస్తూ డాక్టర్ బాబు! డాక్టర్ బాబు! అనుకుంటూ వాడి ప్రేమ కోసం తపించావు ఆఖరికి వాడితో పాటు మా అందరిని వదిలేసి వెళ్లిపోయావు. ఇక్కడ నీ కోసం పిల్లలు తపిస్తున్నారు అని బాధపడుతూ ఉంటుంది. ఈలోగా హిమా కూడా మనం ఇల్లు మారితే శౌర్య మనకి కనిపిస్తుంది కదా నానమ్మ అని అడుగుతుంది. అప్పుడు సౌందర్య,నేను మనుషులను పెట్టి వెతుకుమంటున్నాను మనకి శౌర్య కచ్చితంగా కనిపిస్తుంది అని అంటుంది.
 

ఈలోగా క్యాబ్ వచ్చింది అని ఆ ఇంటి వాచ్మెన్ చెప్పగా ఇంట్లో ఉన్న లగేజ్ అన్ని తీసుకెళ్లి కారులో పెట్టి ఆ ఇల్లు ఖాళీ చేసేస్తారు ఆనందరావు కుటుంబం. ఆ తర్వాత సీన్లో బస్సు హైదరాబాదుకి వెళుతున్న దారిలో దీప  జరిగిన గతమంతా గుర్తుతెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది.ఈలోగ దారిలో ఆ బస్సు తినడానికి ఆగుతుంది అప్పుడు సౌర్య వాళ్ళ పిన్ని బాబాయ్ సౌర్యని తినమని అడిగితే నాకు ఆకలిగా లేదు మీరు వెళ్లి తినండి అని అంటుంది. అప్పుడు వాళ్లు బస్సు ఇక్కడ తర్వాత హైదరాబాద్ లోనే ఆగుతుంది.
 

 దారిలో ఎక్కడ ఆగదు ఆకలేస్తే ఏం చేయలేము అని అంటారు.అప్పుడు కిందకి దిగి షాప్ ముందు కూర్చుంటుంది శౌర్య.ఈలోగా దీప బస్సులోనే ఉండిపోతుంది అలాగా ఆలోచించుకుంటూ ఉంటుంది ఈలోగా కండక్టర్ ఇప్పుడు తినకపోతే మళ్లీ హైదరాబాద్ వరకు తినలేరు మేడం అని అంటారు. అప్పుడు దీప కిందకు దిగుతుంది. ఈ లోగ సౌర్య బన్ తింటూ పొలమారుతుంది. మంచినీళ్లు కోసం పక్క షాప్ కి వెళ్తే పది రూపాయలకు 500 చేంజ్ చేయడం కుదరదు అని వాళ్ళు అంటారు.
 

 అదే సమయంలో దీప కూడా ఆ షాప్ కి వెళ్లి మంచినీళ్లు కొంటుంది. అప్పుడు నా దగ్గర చేంజ్ లేదు మేడం మీ దగ్గర చేంజ్ ఉందా? అని అడగగా నా దగ్గర చేంజ్ లేదండి వాటర్ బాటిల్ నేనే కొనిస్తాను మీరు తీసుకోవడానికి మొహమాట పడితే అమ్మ కొనిచ్చిందని చెప్పండి ఆ పాపకి అని అంటుంది దీప.కానీ ఇక్కడ సంఘటనలో దీప,శౌర్య ఒకరికొకరు కలుసుకోరు. ఆ తర్వాత సౌర్య వాళ్ళ పిన్ని శౌర్యకి మంచినీళ్లు ఇచ్చింది అప్పుడు ఇలా ఒక ఆవిడ వచ్చింది. డబ్బులు తీసుకోకుండానే మనకు మంచి నీళ్లు ఇచ్చింది అని అంటుంది.
 

 నేను ఆవిడకి థాంక్స్ చెప్తాను అని సౌర్య అనగా బస్సులోనే ఉంటారు కదా తర్వాత చెబుదువు గానివిలే అంటుంది శౌర్య వాళ్ళ పిన్ని.బస్సు ఎక్కిన తర్వాత దీప అలాగా ఆలోచించుకుంటూ పడుకుండిపోయింది. ఆ తర్వాత సీన్లో దీప కి వైద్యం చేసిన డాక్టర్ బయట గార్డెన్లో కూర్చుని ఫైల్స్ చూస్తూ ఉండగా ఒక నర్స్ వచ్చి ఆవిడ భర్త దొరకలేదు కదా సార్ అని అంటుంది. అప్పుడు ఆ డాక్టర్ ఇప్పుడు వాళ్ళ భర్త బతకడం కన్నా వాళ్ళ పిల్లలకు తను బతికి ఉందని విషయం తెలియడం ముఖ్యం.
 

వచ్చాక మనం వెతకడం మొదలు పెట్టాలి అని అంటాడు డాక్టర్. ఆ తర్వాత సీన్లో సౌర్య, నేను ఆవిడకి థాంక్స్ చెప్తాను ఎక్కడా పిన్ని అని అనగా ఇప్పుడు పడుకున్నారు అమ్మ లేచాక చెబుదువు గానివి లే అని అంటుంది. కొంచెం సేపు తర్వాత శౌర్య పడుకుండిపోతుంది చలివేస్తుందని శౌర్య ముఖం మీద దుప్పటి కప్పేస్తారు వాళ్ళ పిన్ని  ఈ లోగ బస్సు హైదరాబాద్ వస్తుంది. అప్పుడు ముసుగులో ఉన్న సౌర్య నీ దీప చూస్తుంది కానీ అది సౌర్య అని గుర్తుపట్టలేదు దీప. పాప నీకు థాంక్స్ చెప్దామనుకున్నదే అమ్మ కానీ పడుకుండిపోయింది అని అంటుంది శౌర్య వాళ్ళ పిన్ని.
 

 ఏం పర్వాలేదు అమ్మ అని చెప్పి దీపు వెళ్ళిపోతుంది.శౌర్య లేచి ఆవిడ ఏరి అని అనగా వెళ్లిపోయారు అని అంటారు సౌర్య వాళ్ళ పిన్ని .ఆ తర్వాత సీన్లో పిన్ని బాబాయ్లతో ఆటోలో వెళుతూ ఉండగా వాళ్ల పిన్ని బాబాయ్ లు ఆఖరికి మనం హైదరాబాద్ వచ్చేసాము. ఇంక నువ్వు మీ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే మాకు ఒక బెంగ తీరిపోతుంది అక్కడ నువ్వు సంతోషమైన జీవితాన్ని గడుపుతావు ఇంక మేము ఎవరో కూడా తెలియదు మన పరిచయం లేనట్టే అనుకో అని అనగా శౌర్య వాళ్ళని తిడుతుంది మీరు నాకు పరిచయం లేదు కదా మరి వెళ్ళిపోండి అని అరుస్తుంది. ఉత్తినే అన్నాము అమ్మ అని శౌర్య వాళ్ళ పిన్ని అంటుంది. అయినా  ఇల్లు ఇల్లు అని ఎందుకు నా ప్రాణాలు తీస్తున్నారు అని శౌర్య అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!