సౌందర్య 100 కోట్ల ఆస్తి ఏమయ్యింది..? రహస్య వీలునామాలో ఏముంది..? సంచలన నిజాలు..?

First Published Apr 21, 2024, 7:06 AM IST

దివంగత హీరోయిన్  సౌందర్య హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించగా.. చనిపోయే ముందు 100 కోట్ల విలువైన వీలునామా రాసిందని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అందులో నిజం ఎంత..? 

మహానటి సావిత్రి తరువాత అంతటి పేరు తెచ్చుకున్న హీరోయిన్ సౌందర్య. సావిత్రిలాగానే చిన్నవయస్సులోనే సౌందర్య కూడా కన్నుమూశారు. మనోహరమైన కళ్లతో, ముగ్ధుల్ని చేసే అందంతో, అద్భుతమైన చిరునవ్వుతో అందరినీ ఆకట్టుకున్న నటి  సౌందర్య. బెంగళూరుకు చెందిన ఆమె..  కన్నడ కుటుంబంలో పుట్టింది

1972లో జన్మించిన నటి సౌందర్య సినిమాల్లో నటించాలనే ఆసక్తితో అవకాశాల కోసం చాలా కష్టాలు పడిందట. కన్నడ భాషలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి.. ఆతరువాత తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది బ్యూటీ. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల లో సౌందర్య ఒకరు. తెలుగు స్టార్ హీరోలందరితో ఆమె సినిమాలు చేసింది. 
 

కమల్ హాసన్ కు షాక్ ఇచ్చిన రామ్ చరణ్, బాలీవుడ్ లో మెగా పవర్ దే పై చేయి..

తెలుగుతో పాటు తమిళం, మలయాళం మొదలైన దక్షిణ భారత భాషల్లో ప్రముఖ హీరోలందరితో కలిసి నటించింది సౌందర్య.  అటు బాలీవుడ్ లో కూడా  అమితాబ్ జోడీగా.. సూర్య వంశంలో మీనా పాత్రను హిందీలో సౌందర్య చేసింది.

ఇళయరాజా గొప్పవారేమీ కాదు..మద్రాస్‌ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

 అమితాబ్ బచ్చన్ సరసన నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. వరుసగా హిందీ ఆఫర్లు వచ్చినా.. సౌత్ లో బిజీగా ఉండటంతో.. ఆమె హిందీ సినిమాలు చేయలేకపోయింది. 

ఇక హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న సమయంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టింది సౌందర్య.  2004లో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇక ఆమె పార్టీ తరపును ప్రచారానికి తన తన సోదరుడు అమర్‌నాథ్‌తో కలిసి వెళ్తుండగా.. హెలికాఫ్టర్ ప్రమాదంలో. నటి సౌందర్య మృతి చెందారు.
 

ఇప్పటికీ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నటి సౌందర్య.. అతి తక్కువ కాలంలోనే లీడర్‌గా కూడా మంచి పేరు తెచ్చుకుంది. పెళ్లయిన ఏడాదిలోపే మరణించిన నటి సౌందర్య చనిపోయే నాటికి గర్భవతి. కోట్ల ఆస్తికి అధిపతిగా ఉన్న సౌందర్య తన మరణానికి ముందు ఆస్తికి సంబంధించి వీలునామా కూడా రాసుకున్నట్లు సమాచారం. 

అయితే ఈ వార్తలు వైరల్ అవుతుండటంతో... ఈ విషయాన్ని సౌందర్య భర్తతో పాటు.. ఆమె తల్లి కూడా ఖండించినట్టుతెలుస్తోంది.  31 ఏళ్ల వయస్సులో ఆమె వీలునామా ఎందుకు రాస్తుంది. రాయాల్సిన అవసరం ఏంటి అంటూ వారు వెల్లడించారు. సౌందర్య తన 100 కోట్ల ఆస్తికి వీలునామ రాసిందన్న వార్త బాగా వైరల్ అయ్యింది. 

అంతే కాదు నటి సౌందర్య 100 కోట్ల ఆస్తి  వీలునామా వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో సౌందర్య భర్తతో పాటు.. ఆమె తల్లిపై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.  వీలునామా రాసిందనే విషయాన్ని దాచిపెట్టి సౌందర్య తల్లి, భర్త ఇద్దరూ సగం వాటా పంచుకున్నారని  అంటున్నారు. అయితే ఈ విషయంలో ఎంత వరకూ నిజం ఉందో తెలియదు కాని. ఈన్యూస్ మాత్రం  వైరల్ అవుతోంది. 
 

click me!