ట్రోలర్స్ కి సోహైల్‌ వార్నింగ్‌.. తానేం స్కామ్‌ చేయలేదంటూ, ఫ్యామిలీ జోలికొస్తే వెతికమరీ కొడతానని ఫైర్‌

First Published Dec 28, 2022, 11:39 AM IST

తాను ఆఫర్‌ తీసుకుని వెళ్లడం పట్ల కొందరు కామెంట్లు చేస్తున్నారట. స్కామ్‌ చేశారని, ఫ్యామిలీ గురించి తప్పుగా కామెంట్లు పెడుతున్నారట. `లక్కీ లక్ష్మణ్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వేదికగా వారికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు సోహైల్‌. తానేం బిగ్‌ బాస్‌ 4లో స్కామ్‌ చేసి రాలేదన్నారు. 

బిగ్‌ బాస్‌ 4తో పాపులర్‌ అయిన సోహైల్‌(Sohel) హీరోగా దూసుకుపోతున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఆయన నటించిన తొలి చిత్రం `లక్కీ లక్ష్మణ్‌`(Lucky Lakshman) ఈ నెల 30న విడుదల కాబోతుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ మంగళవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా సోహైల్‌ ట్రోలర్స్ కి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఫ్యామిలీ జోలికొస్తే వెతికి మరీ కొడతా అంటూ ఫైర్‌ అయ్యారు. 

బిగ్‌ బాస్‌ 4 ఫైనల్‌లో సోహైల్‌ రూ. 25 లక్షల ఆఫర్‌ తీసుకుని బయటకొచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో అసలైన విన్నర్‌ సోహైల్‌ అంటూ అంతా కితాబిచ్చారు. చిరంజీవి, నాగార్జునలు కూడా ఆయన్ని అభినందించారు. ప్రశంసించారు. మొత్తంగా ఆ సీజన్‌లో అభిజిత్‌ బీబీ టైటిల్‌ విన్నర్ అయినా, ఆడియెన్స్ హృదయాలను గెలుచుకున్నది మాత్రం సోహైల్‌ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే తాను ఆఫర్‌ తీసుకుని వెళ్లడం పట్ల కొందరు కామెంట్లు చేస్తున్నారట. స్కామ్‌ చేశారని, ఫ్యామిలీ గురించి తప్పుగా కామెంట్లు పెడుతున్నారట. 

`లక్కీ లక్ష్మణ్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వేదికగా వారికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు సోహైల్‌. తానేం బిగ్‌ బాస్‌ 4లో స్కామ్‌ చేసి రాలేదన్నారు. బిగ్‌ బాస్‌ ఇచ్చిన ఆఫర్‌ని తీసుకుని వచ్చానని, మా లాంటి మధ్యతరగతి కుటుంబానికి అది చాలా పెద్ద అమౌంట్‌ అని, రెండు కోట్లతో సమానమని తెలిపారు. కష్టాల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో మాకు ఆ అమౌంట్‌ చాలా హెల్ప్ అయ్యిందని, ఆ అమౌంట్‌తో మా చెల్లి పెళ్లి చేశానని తెలిపారు. 

మా ఇంట్లో చెల్లి పెళ్లి చేయడం ఈజీ కాదని, చాలా పెద్ద విషయమని, అంతకంటే తనకు ఏం కావాలన్నారు. అంతేకాదు ఆ వచ్చిన డబ్బులోనే కొంత ఓల్డేజ్‌ హోంకి సహాయం చేశానని, తనకు వచ్చినదాంట్లో ఇతరులకు సహాయంచేస్తానని తెలిపారు. మాలాంటి వారిని ఆదరించి ఎంకరేజ్‌ చేస్తే ఇంకొంత మందికి సహాయం చేస్తానన్నారు సోహైల్‌. 
 

ఇప్పుడు చేస్తున్న `లక్కీ లక్ష్మణ్‌`ని ఆదరించి సక్సెస్‌ చేస్తే ఆ డబ్బుతో చాలా మందికి సహాయం చేయగలుగుతానని వెల్లడించారు. అయితే తాను నాలుగు సినిమాలు చేస్తున్నా, ఇప్పటి వరకు సొంత ఇళ్లు కొనుక్కోలేదని, చెల్లి పెళ్లికే అయ్యాయని చెప్పారు. ఈ సందర్భంగా ట్రోలర్స్ కి, మీమర్స్ వార్నింగ్‌ ఇచ్చారు సోహైల్‌. బిగ్‌ బాస్‌ నుంచి 25లక్షల ఆఫర్‌ తీసుకోవడం పట్ల కొందరు నెగటివ్‌ కామెంట్లు చేస్తున్నారట. తన ఫ్యామిలీ గురించి తప్పుడు కామెంట్లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సోహైల్‌. 

సినిమా అంటే ఈజీ కాదు, కోట్లు ఖర్చుబెట్టి తీస్తామని, ఎంతో కష్టం ఉంటుందని, ఎంతో మంది కష్టపడితే ఒక సినిమా తయారవుతుందని, దాన్ని మీరు(ట్రోలర్స్‌)ని తప్పుపడుతూ నెగటివ్‌ కామెంట్లు పెడితే ఎలా అని ప్రశ్నించారు. సినిమా కష్టం ఏంటో మీకు తెలియదన్నారు. తననే కాదు, ఏ హీరోని, ఏ సినిమా గురించి ఇలా నెగటివ్‌ కామెంట్లు పెట్టొద్దన్నారు. ఇవి రిపీట్‌ అయితే ఒక్కొక్కడిని వెతికి మరీ కొడతా అని, సీన్‌ మామూలుగా ఉండదని వార్నింగ్‌ ఇచ్చారు సోహైల్‌. 
 

తన తండ్రి గురించి చెబుతూ తాము ఐదుగురు పిల్లలమని, ఓ వైపు సింగరేణిలో మానాన్న జాబ్‌ చేస్తూ, మరోవైపు ఇంటి వద్ద పొలం పనులు చూసుకునేవారని, అలా రాత్రి పగలు కష్టపడి మమ్మల్ని పెంచారని, ఇప్పుడు తాను ఈ స్థాయిలో ఉండటానికి ఆయనే కారణమని తెలిపారు సోహైల్‌. ప్రతి కొడుకు విజయం వెనకాల తండ్రి కష్టం ఉంటుందన్నారు. అదే సమయంలో తనని ఈస్థాయికి తీసుకొచ్చిన ఆడియెన్స్ కి, అభిమానులకు థ్యాంక్స్ చెప్పారు సోహైల్‌. వాళ్లే తనకు గెస్ట్ లు అని, అందుకే ఈ ఈవెంట్‌కి ఎవరినీ గెస్ట్ గా పిలవలేదన్నారు. సినిమా కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరు గెస్టులే అని వెల్లడించారు. 
 

సయ్యద్‌ సోహైల్‌, మోక్ష జంటగా, ఏఆర్‌ అభి దర్శకత్వంలో `లక్కీ లక్ష్మణ్‌` సినిమా రూపొందింది. దత్తాత్రేయ మీడియా గ్యారంటీడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై హరిత గోగినేని నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 30న విడుదల కాబోతుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. ఫన్నీగా మంచి కామెడీని పంచింది. ఫ్యామిలీ ఎలిమెంట్లు, వినోదం, ఎమోషన్స్ మేళవింపుగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. 
 

click me!