ఒక డైలాగ్ తో ఫేమస్ అయ్యాడు షేక్ మహమ్మద్ పాషా అలియాస్ కుర్చీ తాత. కృష్ణకాంత్ పార్క్ వద్ద ఖాళీగా సంచరించే షేక్ మహ్మద్ పాషా ఒకసారి తన బామ్మర్దిని కుర్చీ మడతపెట్టి కొడితే మెడలు విరిగిపోయాయని చెప్పాడు. ఈ డైలాగ్ వైరల్ కావడంతో షేక్ మహ్మద్ పాషా కాస్త... కుర్చీ తాత అయ్యాడు.
కుర్చీ తాత యాటిట్యూడ్ కా బాప్. ఆయన మాటలు కరుకుగా కుంబద్దలు కొట్టినట్లు ఉంటాయి. ఈ లక్షణం యూట్యూబర్స్ ని ఆకర్షించింది. కుర్చీ తాతను ఇంటర్వ్యూ చేసేందుకు యూట్యూబ్ ఛానల్స్ క్యూ కట్టాయి. కుర్చీ తాతకు మంచి బట్టలు కొనిచ్చి, డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు తీసుకునేవారు.
కుర్చీ తాత పవన్ కళ్యాణ్ ని తిట్టాడు. అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి నచ్చలేదు. అలాగే మరికొందరు పొలిటీషియన్స్ కుర్చీ తాత తిట్టాడు. ఈ క్రమంలో కుర్చీ తాతకు శత్రువులు కూడా ఏర్పడ్డారు.
కుర్చీ తాత డైలాగ్ వాడుకున్నందుకు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ డబ్బులు కూడా ఇచ్చాడని ప్రచారం జరిగింది. కుర్చీ తాతకు థమన్ రూ. 1 లక్ష ఇచ్చారట. కుర్చీ తాతకు గుంటూరు కారం యూనిట్ డబ్బులు ఇచ్చారన్నది ఎంత వరకు నిజమో తెలియదు కానీ... అనూహ్యంగా బిచ్చం ఎత్తుకుంటూ కనిపించాడు.
ఓ ఆర్టీసీ బస్సులో కుర్చీ తాత డబ్బులు అడుక్కుంటున్న వీడియో వైరల్ గా మారింది. నన్ను కుర్చీ తాత అంటారు. ఒక రూపాయి ఉంటే బిచ్చం వెయ్యండని అడుక్కుంటున్నాడు. ఈ క్రమంలో కుర్చీ తాతకు బిచ్చమెత్తుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని వాపోతున్నారు.
అయితే గుంటూరు కారం టీమ్ మహేష్ బాబుకు డబ్బులు ఇచ్చారన్నది నిజం కాకపోవచ్చు. అందుకే కుర్చీ తాతకు ఈ పరిస్థితి వచ్చిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇది ప్రమోషనల్ ట్రిక్ కూడా కావచ్చని కొందరు భావిస్తున్నారు.