Naga Chaitanya-Sobhita: నాగచైతన్య, శోభిత గతేడాది డిసెంబర్లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా వీరిద్దరు కెమెరా ముందుకు వచ్చారు. ఒక పెద్ద రహస్యాన్ని బయటపెట్టారు.
Naga Chaitanya-Sobhita: అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడో తరం నటుడిగా రాణిస్తున్నారు నాగచైతన్య. ఇటీవల `తండేల్`తో విజయాన్ని అందుకున్నారు. రెండో పెళ్లి అయిన వేళ, శోభితా దూళిపాళ తన ఇంట్లోకి అడుగుపెట్టిన వేళ చైతూకి బిగ్గెస్ట్ సక్సెస్ వచ్చింది.
అయితే తాజాగా చైతూకి ఓ వారసత్వానికి సంబంధించిన బిరుదు ఇచ్చింది శోభిత. ఏఎన్నార్, నాగ్ మాత్రమే కాదు, అందులో చైతూ కూడా తోపే అని చెప్పేసింది.
25
Sobhita Dhulipala
నాగచైతన్య.. సమంతకి విడాకుల తర్వాత మూడేళ్లు ఒంటరిగానే ఉన్నాడు. కానీ గతేడాది డిసెంబర్లో రెండో పెళ్లి చేసుకున్నాడు. హీరోయిన్ శోభితా దూళిపాళని ప్రేమించి రెండో వివాదం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరు రొమాంటిక్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు.
అయితే ఫస్ట్ టైమ్ ఈ ఇద్దరు కలిసి కెమెరా ముందుకు వచ్చారు. ఇప్పటి వరకు ఈ ఇద్దరు కలిసి నటించింది లేదు. కానీ మొదటిసారి కెమెరా ముందు మెరిశారు. ఇద్దరు కలిసి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.
వోగ్ ఛానెల్ కోసం ఈ ఇద్దరు కలిసి ఇంటర్య్వూ ఇవ్వడం విశేషం. ఇందులో పర్సనల్గా ఒకరి గురించి ఒకరు వెళ్లడించారు. ప్రస్తుతం ఆ ప్రోమో వైరల్ అవుతుంది. ఇందులో చైతూకి వారసత్వం బిరుదు ఇచ్చేసింది శోభితా. బేసిక్గా అక్కినేని హీరోలంటేనే రొమాంటిక్ అంటుంటారు.
ఏఎన్నార్ నుంచి నాగార్జున వరకు ఆ బిరుదు ఉంది. ఏఎన్నార్ చాలా ప్రేమ కథలు చేశారు. సినిమా సెట్లోనూ చాలా రొమాంటిక్గా ఉండేవారట. చాలా మంది హీరోయిన్లు ఈ విషయాన్ని చెప్పారు. ఆయన ఏజ్ 60 కాదు, ఇరవై అని తెలిపారు.
ఇక నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనకు మన్మథుడు అనే బిరుదే ఉంది. ఇప్పుడు చైతూకి కూడా అలాంటి బిరుదే వచ్చింది. అది శోభిత ఇవ్వడంవిశేషం. ఇద్దరిలో ఎవరు ఎక్కువ రొమాంటిక్ అని ప్రశ్నకి స్పందిస్తూ చైతూనే రొమాంటిక్ అని తెలిపింది శోభితా. చైతూ కూడా దాన్ని ఒప్పుకున్నాడు.
ఫస్ట్ మూవ్ ఆయనదే ఉంటుందని చెప్పింది. ఇక ఇంట్లో ఇద్దరికి కుక్కింగ్ రాదని, కానీ బాగా తింటామని చెప్పింది. మరోవైపు ఇద్దరిలో తాను ఫన్నీ పర్సన్ అని, కాకపోతే కావాలని చేయనని, అనుకోకుండా అలా ఫన్నీ విషయాలు జరుగుతాయని తెలిపింది శోభిత.