బాలీవుడ్ హీరోయిన్ల మధ్య పోటీ సర్వసాధారణమే. అయితే అది సోషల్ మీడియాకి కూడా పాకింది. సోషల్ మీడియా అకౌంట్లలో ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్ ఉంటే వారు టాప్అని అర్థంగా భావిస్తుంటారు. అయితే ఇందులో దీపికాని మించిపోయింది శ్రద్ధా కపూర్.
undefined
56.5మిలియన్ ఫాలోవర్స్ కి చేరుకుని ఇండియాలో టాప్లో ఉన్న సెలబ్రిటీల్లో మూడు స్థానానికి చేరుకుంది. గత ఏడాది నుంచి శ్రద్ధా భారీగా తన ఫాలోయింగ్నిపెంచుకుంది. ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ, తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ పెడుతూ అభిమానులకు, నెటిజన్లకు దగ్గరవుతుంది. ఈ నేపథ్యంలోభారీ ఫాలోయింగ్ని పెంచుకుంది.
undefined
ఇక గతంలో భారీ ఫాలోయింగ్తో మూడో స్థానంలో ఉన్న స్టార్ హీరోయిన్ తనని శ్రద్ధా దాటేయడంతో దీపికా పదుకొనె షాక్కి గురవుతుంది. శ్రద్ధా దూకుడు ముందు తానువెనకబడిపోయింది.
undefined
52.3 మిలియన్స్ ఫాలోవర్స్ తో దీపికా నాలుగో స్థానానికి పరిమితమయ్యింది. ఇటీవల దీపిక డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. శ్రద్ధాపై కూడాఆరోపణలు రావడంతో విచారణ కూడా ఫేస్ చేశారు.
undefined
ఇక ఇండియన్ సెలబ్రిటీల్లో 82.4మిలియన్ ఫాలోవర్స్ తో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో నిలవగా, రెండో స్థానంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఉంది.
undefined
ఆమె 58.2 మిలియన్ ఫాలోవర్స్ ని కలిగి ఉంది. ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ సినిమాలను దాదాపు వదిలేసినట్టేఅని టాక్ వినిపిస్తుంది.
undefined