బిగ్ బాస్ సీజన్ 7లో ఇక మిగిలింది తుది దశ మాత్రమే. ఫైనల్ స్టేజ్ లోకి గేమ్ ఎంటర్ అయిపోయింది. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో ఫైనలిస్టులు ఎవరో తెలిసిపోయింది. టైటిల్ రేసులో నిలబడేది వీరే అంటూ నాగార్జున రివీల్ చేశారు. ఆదివారం ఎపిసోడ్ లో నాగార్జున ఎంట్రీ ఇవ్వగానే చిన్న షాక్ ఇచ్చారు. మొత్తంగా బిగ్ బాస్ సీజన్ 7 ఫైనలిస్టులుగా నిలిచింది అర్జున్, ప్రియాంక, యావర్, అమర్ దీప్, ప్రశాంత్, శివాజీ. ఇక శోభా శెట్టి ఎలిమినేట్ అయి హౌస్ నుంచి బయటకి వెళ్ళింది.