శోభా శెట్టి సోషల్ మీడియాకు దూరం కావడానికి కారణాలు ఏంటీ అని అంతా ఆరా తీస్తున్నారు. అయితే ఆమె తన వ్యక్తిగత సమస్యల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ కు వెళ్లి వచ్చిన తరువాత శోభా శెట్టికి అవకాశాలు తగ్గిపోయాయి. కార్తీక దీపం సీజన్ 2 నడుస్తుంది కాని అందులో ఆమె పాత్ర మిస్ అయ్యింది.
అలాగే నిశ్చాతార్థం జరిగి ఏడాది గడిచింది. కానీ పెళ్లి మాట మాత్రం ఎత్తలేదు. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ బ్యూటీ గార్మెంట్ బిజినెస్ స్టార్ట్ చేసినట్లు తెలుసింది. అది కూడా సాఫీగా జరగడం లేదని టాక్.
ఇలా తాను అనుకున్నవీ ఏవీ జరగకపోవడంతో శోభ డిప్రెషన్ లోకి వెళ్లిందని ప్రచారం జరుగుతోంది. అందుకే కాస్త గ్యాప్ తీసుకోవడానికి సోషల్ మీడియాకి కూడా దూరమైనట్లు తెలుస్తోంది.ఇందులో నిజం ఎంతో తెలియదు కాని.. బయట ప్రచారం మాత్రం ఇదే జరుగుతోంది.