Shilpa Chakravarthy: శిల్పా చక్రవర్తి ఒకప్పుడు యాంకర్గా రాణించిన విషయం తెలిసిందే. టీవీ షోస్, సీరియళ్లు, ఈవెంట్లు చేస్తూ ఆకట్టుకుంది. అప్పట్లో సుమ, ఉదయభానులకు పోటీగా ఆమె రాణించింది. కానీ చాలా కాలంగా ఆమె టీవీకి దూరమయ్యింది.
మధ్యలో `బిగ్ బాస్ తెలుగు 3`లో మెరిసింది. అందులో రచ్చ చేసింది. కానీ మళ్లీ కనిపించలేదు. దీంతో ఆమెని జనాలు మర్చిపోయారు. ఈ క్రమంలో ఇన్నాళ్లకి బయటకు వచ్చింది శిల్పా చక్రవర్తి. ఏడేళ్లు తాను పడ్డ స్ట్రగుల్స్ గురించి వెల్లడించింది. ఎమోషనల్ అయ్యింది.
ఈ సందర్భంగా శిల్పా చక్రవర్తి కన్నీళ్లు పెట్టుకుంది. తనని దారుణంగా ట్రోల్ చేశారంటూ, బూతులు తిడుతూ కామెంట్లు పెట్టారని వాపోయింది. దీంతో తాను డిప్రెషన్లోకి వెళ్లినట్టు చెప్పింది.
అంతకు ముందు విమర్శలు వచ్చినా పట్టించుకోలేదని, కానీ ఓ షో(బిగ్ బాస్) తర్వాత తనని దారుణంగా ట్రోల్ చేశారని, ఆ కామెంట్లు విన్నాక తనపై తనకు నమ్మకం పోయిందని, దీంతో చాలా కుంగిపోయానని, ఇక ఈ జీవితం వద్దు అనేస్థితికి వెళ్లిపోయినట్టు చెప్పింది శిల్పా చక్రవర్తి.
తాను అంతకు ముందు యాంకర్గా షోస్ చేశాను. ఆడియెన్స్ ఎంతగానో ఆదరించారు. కానీ పిల్లల కోసం కొంత బ్రేక్ తీసుకున్నాను. ఆ తర్వాత కమ్ బ్యాక్ కావాలనుకున్నాను. ఆ సమయంలోనే ఓ రియాలిటీ షో(బిగ్ బాస్) ఆఫర్ వచ్చింది. సరదాగా వెళ్దామని వెళ్లాను. అందులో కూడా చాలా మంది నాపై రకరకాలుగా కామెంట్లు చేశారు.
ఆ సమయంలో ఏం జరిగిందో మీకు తెలిసిందే. కానీ షో నుంచి బయటకు వచ్చాక ఆ షోలో జరిగింది చూస్తే తనపై ఇలాంటి అభిప్రాయం ఉందా? అనే ఫీలింగ్ కలిగింది. ఆ సమయంలో సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్లు చూస్తే షాక్ అయినట్టు తెలిపింది శిల్పా చక్రవర్తి.
తనకు తెలుగు రాదు, కానీ తన బావ(భర్త) అవి చదివి చెప్పమంటే ఆయన వద్దు నువ్వు బాధపడతావని చెప్పాడు. అయినా వాటిని చదివితే చాలా దారుణంగా తిడుతూ కామెంట్లు పెట్టారు. నేను దేనికి పనికి రాను అనేలా కామెంట్లు ఉన్నాయి. ఆ సమయంలో ఆ కామెంట్లు చూసి చాలా డిప్రెషన్లోకి వెళ్లాను.
దాన్నుంచి బయటకు రావడానికి దాదాపు నాలుగు నెలలు పట్టింది. ఆఫర్లు లేవు, షోస్ లేవు, ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. దీనికితోడు కరోనా వచ్చింది. ఆ సమయంలో తన భర్త వ్యాపారం కూడా క్లోజ్ అయ్యింది. చాలా ఇబ్బందులు పడ్డాం. నాన్న అనారోగ్యంతో చనిపోయారు. ఆయన్ని కూడా కాపాడుకోలేకపోయాను. ఆ దెబ్బతో మరింతగా డిప్రెషన్లోకి వెళ్లాను.
కరోనా తర్వాత కోలుకుంటున్న దశలో అమ్మకి క్యాన్సర్ అని తెలిసింది. ఆమెకి ట్రీట్ మెంట్ ఇప్పించాం. ఇప్పుడు బాగానే ఉన్నారు. ఆ తర్వాత తెలిసినవాళ్లే నానా రకాలుగా మాట్లాడారు. షోస్ చేయడం లేదా? ఇంట్లోనే ఉంటున్నావా? అంటూ చిన్న చూపు చూస్తూ మాట్లాడారు.
వారి మాటలు కూడా చాలా బాధపెట్టాయి. బంధువులే సూటిపోటి మాటలు మాట్లాడారు. ఇలా ఏడేళ్లపాటు నరకం చూశాను. వాటిని అన్నింటిని భరించాను, దాన్నుంచి ఇప్పుడిప్పుడు బయటపడుతున్నాను.
నెమ్మదిగా కోలుకుంటూ ఇప్పుడు మళ్లీ బిజీ అవుతున్నాను. మళ్లీ సీరియల్స్, టీవీ షోస్ చేస్తున్నాను అని తన కమ్ బ్యాక్ వీడియోని పంచుకుంది శిల్పా చక్రవర్తి. తన యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ఆమెని ఓదార్చుతూ కామెంట్లు పెడుతున్నారు.
మీరు స్ట్రాంగ్గా ఉండాలని, మంచి మనసు మీది అని, మంచి టాలెంట్ పర్సన్ అని, బెస్ట్ యాంకర్ అంటూ ఆమెకి బూస్ట్ ఇస్తున్నారు. మొత్తంగా అనేక స్ట్రగుల్స్ నుంచి బయటపడి మళ్లీ మనల్ని అలరించడానికి రాబోతుంది శిల్పా చక్రవర్తి.
read more: `ఉప్పెన` విలన్తో పూరీ జగన్నాథ్ సినిమా.. ఛార్మి స్థానంలో కొత్త ప్రొడక్షన్, క్రేజీ డిటెయిల్స్
alsoread: సావిత్రి పై బిగ్ బాస్ గీతూ రాయ్ సంచలన వ్యాఖ్యలు, మండిపడుతున్న మహానటి ఫ్యాన్స్