హీరో శర్వానంద్ వివాహం గ్రాండ్గా జరిగింది. హైకోర్ట్ లాయర్ పసునూరి మధుసూదన్ రెడ్డి కూతురు రక్షిత రెడ్డితో శనివారం రాత్రి(ఆదివారం తెల్లవారుజామున) గ్రాండ్గా వివాహం జరిగింది. మూడు ముళ్ల బంధంతో వీరిద్దరు ఒక్కటయ్యారు. అతి కొద్ది మంది బంధుమిత్రులు, సినిమా సెలబ్రిటీల సమక్షంలో ఈ వివాహ వేడుక జరగడం విశేషం.
రాజస్థాన్లోని జైపూర్ ప్యాలెస్లో శర్వానంద్, రక్షిత ల పెళ్లి వేడుక జరిగింది. అందుకోసం గ్రాండ్గా ఏర్పాట్లు చేశారు. అంతేకాదు శర్వా, రక్షితలు సైతం గ్రాండియర్గా ముస్తాబయ్యారు. రాయల్ లుక్లోకి మారిపోయారు. రాయల్ డిజైనింగ్వేర్ కి సంబంధించి పెళ్లిదుస్తులు ధరించారు.
ఈ సందర్భంగా శర్వానంద్, రక్షిత రెడ్డిలు కలిసి ఫోటో షూట్ చేశారు. ఇందులో ఈ ఇద్దరు రాజకుటుంబానికి చెందిన జంటని తలపించడం.. రాజకుమారుడు, రాజకుమారిలను తలపించడం విశేషం. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరోవైపు పెళ్లి సందర్బంగా ఈ ఇద్దరు ఒకరిపై ఒకరు పూలు చల్లుకోవడం, అత్యంత ఆనందకర వాతావరణంలో తమ పెళ్లిని చేసుకోవడాన్ని తలపించే ఫోటో సైతం ఆకట్టుకుంటుంది. ఇది వైరల్గా మారింది.
ఇందులో రామ్చరణ్ స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచారు. ఇండస్ట్రీ నుంచి ఆయన పాల్గొనడం విశేషం. రామ్చరణ్, శర్వానంద్ చిన్నప్పట్నుంచి మంచి స్నేహితులు. ఈ నేపథ్యంలో ఫ్రెండ్ కోసం జైపూర్కి వెళ్లారు చరణ్. రెండు రోజులుగా ఆయన అక్కడే ఉన్నారు.
పెళ్లి మండపంలో పూజారి మంత్రోచ్ఛరణలతో పెళ్లి కార్యక్రమం హిందూ సంప్రదాయంలో జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్ గా మారింది. శర్వానంద్, రక్షిత ఎంగేజ్మెంట్ జనవరి చివర్లో జరిగిన విషయం తెలిసిందే. సినిమాలతో శర్వా బిజీగా ఉండటంతో మ్యారేజ్కి డిలే అయ్యింది. ఎట్టకేలకు మూడుముళ్లతో ఈ ఆదివారం ఓ ఇంటివాడయ్యాడు శర్వానంద్.