బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ముంబైలోని తన ఐకానిక్ బంగ్లా 'మన్నత్' విస్తరణకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదనపు అంతస్తుల నిర్మాణానికి ఇచ్చిన CRZ క్లియరెన్స్ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది.
షారుఖ్ ఖాన్ 'మన్నత్' బంగ్లాకు అదనంగా రెండు అంతస్తులు నిర్మించుకోవడానికి ఇచ్చిన కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (CRZ) క్లియరెన్స్ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. పర్యావరణ నిబంధనలకు అనుగుణంగానే అనుమతులు ఉన్నాయని అధికారులు నిర్ధారించడంతో, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది. దీంతో, ఇప్పుడు ఇంటి పునరుద్ధరణ పనులు ముందుకు సాగనున్నాయి.
23
సెలబ్రిటీ స్టేటస్కు సంబంధం లేదన్న కోర్టు
విచారణ సమయంలో, పిటిషనర్ తరఫు లాయర్ వాదిస్తూ.. ఇది ఒక ప్రముఖ నటుడికి సంబంధించిన విషయం కాబట్టి ప్రత్యేకంగా చూడకూడదని అన్నారు. ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ స్కామ్ను బయటపెట్టడంలో పిటిషనర్ పాత్రను కూడా ఆయన గుర్తుచేశారు. అయితే, సుప్రీం కోర్టు ఈ వాదనను తోసిపుచ్చింది. షారుఖ్ ఖాన్ సెలబ్రిటీ స్టేటస్తో తమకు సంబంధం లేదని, కేవలం చట్టపరమైన అంశాల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది.
33
సినిమాల విషయానికి వస్తే..
ఈ లీగల్ విక్టరీతో పాటు, షారుఖ్ ఇటీవల ఢిల్లీలోని పంచశీల్ పార్క్లో ఉన్న తన పాత ఇంటి మిగిలిన ఫ్లోర్లను కూడా రూ. 37 కోట్లకు కొనుగోలు చేసి పూర్తి యాజమాన్య హక్కులు పొందారు. ఇక సినిమాల విషయానికొస్తే, ఆయన కూతురు సుహానా ఖాన్, దీపికా పదుకొణె, అభయ్ వర్మ నటిస్తున్న 'కింగ్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం 2026 డిసెంబర్ 24న థియేటర్లలో విడుదల కానుంది.