ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా సౌత్ ని ఏలింది ముంబై భామ కుష్బూ సుందర్. విక్టరీ వెంకటేష్ డెబ్యూ మూవీ కలియుగ పాండవులు చిత్రంతో కుష్బూ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. తమిళంలో అత్యధికంగా చిత్రాలు చేసిన కుష్బూ తెలుగు, కన్నడ, మలయాళ భాషలతో పాటు, హిందీలో కూడా చిత్రాలు చేశారు.