జయసుధకు ఏమైంది... గుర్తు పట్టలేనంతగా తయారైన ఆమెను చూసి షాక్ లో ఫ్యాన్స్!

First Published Mar 1, 2021, 8:24 AM IST

సహజనటి జయసుధను చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఆమెకు ఏమైంది అని ఒకింత ఆందోళన చెందుతున్నారు. నెరిసిన జుట్టు, పీక్కుపోయిన కళ్లతో ఆమె కళా విహీనంగా కనిపించగా, కొందరు ఆలోచనలో పడ్డారు. 
 

70లలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన జయసుధ రెండు దశాబ్దాలకు పైగా టాప్ స్టార్ గా వెలుగొందారు. శ్రీదేవి, జయప్రదలతో పాటు స్టార్ హీరోలతో పదుల సంఖ్యలో జయసుధ చిత్రాలు చేశారు.
undefined
ఇక 90ల నుండి జయసుధ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు. హీరో, హీరోయిన్ తల్లి, అత్తా, వదిన వంటి పాత్రలకు పరిమితం అయ్యారు. ఇప్పటికి కూడా టాలీవుడ్ లో హాట్ ఫేవరేట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమె ఉన్నారు.
undefined
గతంతో పోల్చితే జయసుధ ఈ మధ్య సినిమాలు తగ్గించారు. 2019లో మహేష్ నటించిన మహర్షి, బాలయ్య హీరోగా తెరకెక్కిన రూలర్ చిత్రాలలో జయసుధ కీలక రోల్స్ చేయడం జరిగింది.
undefined
కాగా 'జానకి కలగనలేదు'  అనే ఓ సీరియల్ త్వరలో బుల్లితెరపై ప్రసారం కానుంది. ఆ సీరియల్ టీమ్ కి బెస్ట్ విషెస్ చెవుతూ జయసుధ ఓ వీడియో చేశారు.
undefined
ఆ వీడియోలో జయసుధ లుక్ ఆందోళన కలిగించేదిగా ఉంది.  నెరసిన జుట్టు, పీక్కుపోయిన ముఖంతో ఆమె గతానికి బిన్నంగా గుర్తు పట్టలేనంతగా మారిపోయి ఉన్నారు.
undefined
బరువు కూడా తగ్గారని ఆ వీడియో ద్వారా అర్థం అవుతుంది.  జయసుధ లేటెస్ట్ లుక్ చూసిన ఆమె అభిమానులు.. ఆమె ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.
undefined
ఇప్పటికే 60ఏళ్ళు పైబడిన జయసుధ మేకప్ లేకుండా కనిపించడంతో, లుక్ అలా ఆందోళనకరంగా అనిపించింది.
undefined
ఇక బాలీవుడ్ నిర్మాత నితిన్ కపూర్ ని ప్రేమ వివాహం చేసుకున్న జయసుధ, ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. ఇటీవల పెద్ద కుమారుడు వివాహం గ్రాండ్ గా నిర్వహించారు. నితిన్ కపూర్ 2017లో గుండెపోటుతో మరణించారు.
undefined
click me!