ఢీ డాన్స్ షోద్వారా ఇండస్ట్రీకిపరిచయం అయ్యి.. ఢీ షోకే జాడ్జిగా మారారు శేఖర్ మాస్టర్. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరికి కొరియోగ్రాఫర్ గా శేఖర్ మాస్టర్ పనిచేశారు. ఆయన కంపోజింగ్ లో ఒక్క సాంగ్ అన్నా లేకుండా.. సినిమా ఉండదు. స్టార్ హీరోలు సైతం శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఒక్క సాంగ్ అయినా చేస్తుంటారు.
భర్త మాటలు విని కోట్లు నష్టపోయిన రోజా, ఆరోజు ఆ పని చేయకుండా ఉంటే...?
ఈక్రమంలో నవువులతో పాటు.. ఏడుపులు కూడా కామన్. అయితే జడ్జి స్థానంలో ఉన్నవారు ఎమెషనల్ అవ్వడం అరుదుగా జరుగుతుంటుంది. ఇక తాజాగా ఢీ నుంచి రిలీజ్ చేసిన ఎపిసోడ్ ప్రోమోలో శేఖర్ మాస్టర్, ఇంకో డ్యాన్స్ మాస్టర్ కూడా ఏడవడంతో ప్రోమో వైరల్ గా మారింది.
తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో మధు అనే కంటెస్టెంట్ పక్కన డ్యాన్సర్లు తప్పు వేయడంతో మధ్యలో పర్ఫార్మెన్స్ ఆపేసారు. దీంతో శేఖర్ మాస్టర్ దీని గురించి మాట్లాడారు. ఆ పర్ఫార్మెన్స్ ని కంపోజ్ చేసిన డ్యాన్స్ మాస్టర్ స్టేజిపైకి వచ్చాక శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. మేము డ్యాన్సర్లు కదా. మాకు డ్యాన్స్ తప్ప వేరే ఏం రాదు. డ్యాన్స్ మిస్ అయితే మాస్టర్ ఎక్కడ వెళ్ళిపోతాడో, మాస్టర్ వెళ్ళిపోతే మాకు ఎక్కడ వర్క్ పోతుందో అని భయపడేవాళ్ళం అంటూ ఎమోషనల్ అయ్యారు.. ఏడ్చేశారు.
ఈ పరిణామంతో అక్కడ అంతా పరిస్థితి మారిపోయింది. అప్పటివరకూ నవ్వులు పూయించిన ఆదిలాంటి వారు కూడా.. ఒక్క సారిగా సైలెంట్ అయ్యారు. ఎమోషనల్ అయ్యారు. శేఖర్ మాస్టర్ మాటలకు అక్కడున్న కంటెస్టెంట్స్ కూడా ఏడ్చేశారు. ఆ పర్ఫార్మెన్స్ కంపోజ్ చేసిన డ్యాన్స్ మాస్టర్ కూడా స్టేజిపైనే బోరుమన్నాడు.
దాంతో ఆ మాస్టర్ ను యాంకర్ నందు ఓదార్చడం కూడా కనిపించింది. అయితే శేఖర్ మాస్టర్ ఇంత ఎమోషనల్ అవ్వడానికి కారణం ఏంటో ఎపిసోడ్ చూస్తే కాని అర్ధం కాదు. ఇక ఈ షోలో శేఖర్ మాస్టర్ తో పాటు.. హీరోయిన్ హన్సిక, గణేష్ మాస్టర్ కూడా ఉన్నారు., ఆది, నందు, పండు లాంటిస్టార్ ఈ షోలో సందడి చేస్తున్నారు.