అప్పట్లో సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్న నందగోపాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. సావిత్రి చివరి రోజుల్లో తాను చనిపోతే సమాధిపై ఏం రాయాలో ఆమె ముందే చెప్పిందట. మరి ఆమె ఏం చెప్పిందనేది చూస్తే,
`మరణంలోనూ జీవితంలోనూ ఒక మహోన్నతమైన తార ఇక్కడ శాశ్వత విశ్రాంతిని పొందుతుంది. ఇక్కడికి ఎవరు వచ్చినా సానుభూతితో కన్నీళ్లని విడవనక్కర్లేదు. ఈ సమాజంలో ఎవరూ కూడా హీనంగా చూడకుండా మరణం లేని ఈ సమాధిలో నిద్రిస్తున్న మహా ప్రతిభకి చిహ్నంగా ఒక పూలమాలని ఉంచండి. ఇదే నాకు మీరిచ్చే గౌరవం` అని సావిత్రి కోరుకున్నారట.
మరి అది తన సమాధిపై రాశారా? లేదా అనేది తెలియదు. కానీ ఆమె చివరి కోరిక ఇదే అని, సీనియర్ జర్నలిస్ట్ నందగోపాల్ చెప్పినట్టుగా ఓ వార్త ప్రచారం అవుతుంది. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.