ఈ కార్యక్రమానికి చిరంజీవి సతీమణి సురేఖ కూడా హాజరయ్యారు. అంతేకాదు సహజనటి జయసుధ, మురళి మోహన్, పరుచూరి గోపాల కృష్ణ, అల్లు అరవింద్ లాంటి ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. చిరు సతీమణి సురేఖ అప్పుడప్పుడూ సినిమా ఈవెంట్స్ లో కనిపిస్తుంటారు. కానీ ఆమె వేదికపై మాట్లాడింది లేదు.