Devatha: రుక్మిణిని ఆదిత్య గురించి అడిగిన సత్య.. దేవి వల్ల కుమిలిపోతున్న రాధ!

Published : Jul 23, 2022, 10:38 AM ISTUpdated : Jul 23, 2022, 10:41 AM IST

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత (Devatha) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జులై 23 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
17
Devatha: రుక్మిణిని ఆదిత్య గురించి అడిగిన సత్య.. దేవి వల్ల కుమిలిపోతున్న రాధ!

 ఈరోజు ఎపిసోడ్ లో రాధ ఇంట్లో పని చేసుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి సత్య వస్తుంది. అప్పుడు అక్క నీతో కొంచెం మాట్లాడాలి అని అనగా రాధ ఏ విషయం గురించి అనడంతో ఆదిత్య గురించి అంటూ బాధపడుతుంది సత్య. అప్పుడు రాదని ప్రశ్నిస్తూ అక్క కాంపిటీషన్లో ఏమైనా జరిగిందా? లేకపోతే బావ ఆదిత్య కొట్లాడారా? దేవి ఏమైనా అనిందా అని అడగగా అప్పుడు రాధ ఏమి మాట్లాడకుండా దేవి అన్న మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటుంది.
 

27

 అప్పుడు సత్య ఏం జరిగింది అక్క అని అనగా ఏం జరగలేదు అని చెబుతుంది రాధ. అప్పుడు సత్య ఆదిత్యను నాకు మరింత దగ్గర చేయాలి అంటే అది నీ వల్లే అవుతుంది అంటూ ఆదిత్య గురించి చెప్పుకొని బాధపడి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది సత్య. మరొకవైపు మాధవ ఒంటరిగా ఆలోచిస్తూ ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి దేవి వాళ్ళ ప్రిన్సిపల్ అలాగే ఇద్దరు పెద్ద మనుషులు కూడా వస్తారు.
 

37

అప్పుడు దేవి చెస్ కాంపిటీషన్లో గెలిచింది అని తెలుసుకున్న ప్రిన్సిపల్ దేవిని పొగుడుతూ ఉంటాడు. ఈ చెస్ కాంపిటీషన్ స్కూల్లో పెట్టాలి అనుకున్నాము కానీ చిన్న పిల్ల దిష్టి తగులుతుంది అని చేయలేదు అని ప్రిన్సిపల్ చెప్తాడు. ఇక వారు మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే రాధ అక్కడికి వస్తుంది. అప్పుడు మాధవ రాధ తో మన దేవికి సన్మానం చేస్తారంట అని చెప్పి దేవిని పిలుస్తాడు.  అప్పుడు దేవి అక్కడికి రావడంతో అక్కడున్న వారందరూ దేవుని పొగుడుతూ ఉంటారు.
 

47

అప్పుడు అన్ని విషయాలలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఇటువంటి గొప్ప బిడ్డను కన్నందుకు మీరు చాలా సంతోష. పడాలి అని అనడంతో రాధ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ మాటలకు మాధవ లోలోపల సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ తర్వాత ప్రిన్సిపల్ పెద్ద మనుషులు దేవికి సన్మానం చేసి అక్కడ నుంచి వెళ్లిపోతారు. ఆ తర్వాత రాధ ఒంటరిగా కూర్చుని విషయాల గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటుంది.
 

57

ఇంతలోనే దేవి అక్కడికి వచ్చి అమ్మ ఇప్పటికీ కూడా నువ్వు నాకు ఎందుకు నిజం చెప్పడం లేదు అంటూ రాధ ని ప్రశ్నిస్తూ ఎమోషనల్ అవుతుంది. నాకు చెప్పకుండా నువ్వు ఒక్కదానివే లో లోపలకు కూలిపోతున్నావు. అంటూ తన తండ్రి గురించి మాట్లాడుతూ నువ్వు అంత మంచి దానివి అయినా నిన్ను నాన్న ఎలా వదిలేశాడు అమ్మ అంటూ తన తండ్రి గురించి నానా రకాలు మాటలు అంటుంది దేవి.
 

67

ఆ మాటలకు రాధ ఏం సమాధానం చెప్పకుండా కుమిలిపోతూ ఉంటుంది. అప్పుడు రాధ తన మనసులో నా చెల్లెలు గురించి ఆలోచించి నేను ఇలా బయటకు వచ్చాను కానీ నీ గురించి నేను ఆలోచించలేదు అని బాధపడుతూ ఉంటుంది. మరొకవైపు ఆదిత్య రాధకు ఎంత ఫోన్ చేసినా కూడా రాధా ఫోన్ లిఫ్ట్ చేయదు. దాంతో ఆదిత్య ఏం జరిగిందా అని రాధ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత దేవి, చిన్మయి ఇద్దరు స్కూల్ కి వెళ్తారు.
 

77

అక్కడ తండ్రి కూతుర్ల బంధాన్ని చూసి దేవి బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత స్కూల్లో భాగ్యమ్మ పిల్లల కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి ఆదిత్య వచ్చి దేవిని పిలుస్తాడు. ఆదిత్య రాకను గమనించిన భాగ్యమ్మ టెన్షన్ తో వెళ్లి పక్కన దాక్కుంటుంది.

click me!

Recommended Stories