బాలీవుడ్‌ రొమాంటిక్‌ కపుల్స్ తో క్రేజీ చిత్రానికి భన్సాలీ ప్లాన్‌

First Published Oct 19, 2020, 9:24 AM IST

బాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్‌ సెట్‌ కాబోతుంది. ఓ పీరియాడికల్‌ చిత్రాన్ని విజువల్‌ వండర్‌గా రూపొందించేందుకు బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ ప్లాన్‌ చేస్తున్నారు. 

సంజయ్‌ లీలా భన్సాలీ.. బాలీవుడ్‌లో విజువల్‌ వండర్‌గా, గ్రాండియర్, పీరియాడికల్‌ అండ్‌ హిస్టారికల్‌ చిత్రాలకు పెట్టింది పేరు. ఆయన ఇప్పటికే `దేవదాస్‌`, `సావరియా`,`గుజారిష్‌`, `రామ్‌లీలా`, `బాజీరావు మస్తానీ`, `పద్మావత్‌` వంటి అద్భుతమైన కళాఖండాలను రూపొందించారు.
undefined
ప్రస్తుతం `గంగూబాయి కథియవాడి` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అలియాభట్‌ ఇందులో మెయిన్‌రోల్‌ పోషిస్తుంది. వేశ్య వృత్తిలోకి దిగిన మహిళా ఓ మాఫియాగా ఎదిగిన వైనంనేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది.
undefined
నెక్ట్స్ మరో భారీ చిత్రానికి తెరలేపారు భన్సాలీ. 1952లో వచ్చిన క్లాసిక్‌ `బైజూ బావరా` చిత్రాన్ని రీమేక్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. అక్బర్‌ ఆస్థానంలోని ప్రముఖగాయకుడు తాన్‌సేన్‌ని ఓడించడానికి తన గానంతో బైజు అనే అనామక గాయకుడు చేసే ప్రయత్నం, పోరాటం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.
undefined
తాజాగా దీన్ని దీపికా పదుకొనె, అలియాభట్‌, రణ్‌బీర్‌ కపూర్‌ ప్రధాన పాత్రధారులుగా రూపొందించేందుకు భన్సాలీ ప్లాన్‌ చేస్తున్నారు. ముందుగా దీన్ని రణ్‌వీర్‌ సింగ్‌, ప్రియాంకచోప్రాలతో అనుకున్నా అది వర్కౌట్ కాలేదు. తాజాగా ఈ కాంబినేషన్‌ సెట్‌ చేసినట్టు తెలుస్తుంది.
undefined
ఇప్పటికే భన్సాలీ దీపికాతో `బాజీరావ్‌ మస్తానీ`, `పద్మావత్‌`, `రామ్‌లీలా` చిత్రాలను రూపొందించారు. వీరి కాంబినేషన్‌కిది నాల్గో చిత్రమని చెప్పొచ్చు.
undefined
రణ్‌బీర్‌ కపూర్‌తో `సావరియా` చిత్రాన్ని రూపొందించారు. వీరికిది రెండో చిత్రమవుతుంది. ఇక అలియాభట్‌తోనూ ఇది రెండో సినిమా కానుంది. ఇందులో మాతృకలో నటించినమీనా కుమారి పాత్రలో అలియా కనిపించనున్నారట.
undefined
ప్రస్తుతం బాలీవుడ్‌ క్రేజీ లవ్‌ కపుల్‌గా ఉన్న రణ్‌బీర్‌ కపూర్‌, అలియా కలిసి `బ్రహ్మాస్త్ర`లో నటిస్తున్నారు. వీరి కాంబినేషన్‌కిది రెండోసారి కానుందని చెపొచ్చు.
undefined
click me!