నాగ్‌ పెద్ద ట్విస్ట్...ఎలిమినేషన్‌ ఇద్దరు కాదు ఒక్కరే.. ఎవరంటే?

First Published Oct 18, 2020, 10:08 PM IST

బిగ్‌బాస్‌ 4, 42వ రోజు ఫన్‌ డేగా సాగింది. అదే సమయంలో ఎలిమినేషన్‌తో ఆద్యంతం రక్తికట్టించింది. బిగ్‌బాస్‌ సభ్యులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ఎలిమినేషన్‌ ఇద్దరు కాదు ఒక్కరే అయ్యారు.
 

ఇక నాగార్జున గ్రాండ్‌ ఎంట్రీతో రాగా సండే.. ఫన్‌డే అంటూ గేమ్స్ పెట్టాడు. రెండు టీమ్‌లుగా విడిపోయారు. అఖిల్‌, దివి, హారిక, సోహైల్‌, కుమార్‌ సాయి, అమ్మ రాజశేఖర్‌,నోయల్‌ కలిసి ఏ టీమ్‌గా, మెహబూబ్‌, అరియానా, అభిజిత్‌, మోనాల్‌, లాస్య, అవినాష్‌ కలిసి బీ టీమ్‌గా ఏర్పడ్డారు.
undefined
రెండు టీమ్‌ల నుంచి ఒక్కొక్కరి గేమ్‌ పెట్టాడు. మొదటగా దివి, అభిజిత్‌ కలిసి బెలూన్స్ కొట్టే పోటీలో దివి విన్నర్‌ కాగా, కుస్తీ పోటీలో హారిక, మోనాల్‌ పోటీపడతా, హారికగెలిచింది. నోయల్‌, కుమార్‌ సాయి జోకర్‌ డాన్స్ వేయగా, కుమార్‌ సాయి గెలుపొందారు.
undefined
బ్లైండ్‌ డాన్స్ లో అవినాష్‌, అరియానా పోటీపడగా, అవినాష్‌ గెలిచారు. అరియానా చేయి ఎలా కరెక్ట్ గా పట్టుకున్నావని చెప్పగా, తాను ఊహించానని చెప్పగా, వాడికి ఎక్ ట్రా సెన్స్ ఉందని అమ్మా రాజశేఖర్‌ చెప్పడం నవ్వులు పూయించింది.
undefined
తాడు లాగే గేమ్‌లో ఏ టీమ్‌ విన్‌ అయ్యింది. అంబ్రిల్లా డాన్స్ లో అభిజిత్‌, హారిక పోటీపడతా, హారిక విన్నర్‌ అయ్యారు. బేబీతో డాన్స్ లో అఖిల్‌, లాస్య పోటీపడతా, లాస్యకి మార్కులు పడ్డాయి.
undefined
బుట్టలో బాల్‌ వేసే గేమ్‌లో లాస్య, అభిజిత్‌ పోటీపడతా, లాస్య విన్‌ అయ్యారు. ఈ సందర్భంగా బుట్టలో వేయడం బాగా వచ్చేమో అని నాగ్‌ అనగా, అవునని, మా ఆయన్నిబుట్టలో వేశానని చెప్పడం నవ్వులు పూయించింది.
undefined
ఒకరిని ఎత్తుకుని వెళ్లే పోటీలో సోహైల్‌, మెహబూబ్‌ పోటీపడగా.. మెహబూబ్‌ విన్నర్‌ అయ్యారు. బాల్‌ కొట్టే గేమ్‌లో కుమార్‌ సాయి, అవినాష్‌ పోటీపడగా, కుమార్‌విన్నర్‌ అయ్యారు.
undefined
బెల్లీ డాన్స్ లో సోహైల్‌, మోనాల్‌ పోటీపడగా, మోనాల్‌ గెలిచారు. చైర్‌ డాన్స్ లో దివి, మెహబూబ్‌పోటీపడగా, మెహబూబ్‌ మెప్పించాడు. దివి నడుము అందాలు చూపిస్తూ నడుము తిప్పిన విధానం ఫిదా చేసింది.
undefined
శనివారం ముగ్గురు సేవ్‌ కాగా, ఎలిమినేషన్‌కి ఆరుగురు మిగిలి ఉన్నారు.
undefined
ఇక ఇప్పటి వరకు నామినేషన్‌లో దివి, అభిజిత్‌, అఖిల్‌ సేవ్‌ అయ్యారు. ఇక మిగిలింది మోనాల్‌, కుమార్‌ సాయి, అరియానా ఉన్నారు. వీరిలో ఉత్కంఠభరితమైన ఎపిసోడ్‌లోఅరియానా సేవ్‌ అయ్యారు. కుమార్‌ సాయి, మోనాల్‌ లను బ్యాగ్‌ సర్దుకుని కన్‌ఫెషన్‌ రూమ్‌కి రావాలని నాగ్‌ చెప్పారు. దీంతో హౌజ్‌ మొత్తం ఎమోషనల్‌ అయిపోయింది.ముఖ్యంగా అఖిల్‌ ఎమోషనల్‌ అయ్యారు. ఆ తర్వాత మోనాల్‌ కన్నీళ్లు పెట్టుకుంది.
undefined
కన్‌ఫెషన్‌ రూమ్‌కి వచ్చిన మోనాల్‌, కుమార్‌ సాయిలకు పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు నాగ్‌. ఒకరు కన్‌ఫెషన్‌ రూమ్‌లో ఉంటారని, ఒకరు ఎలిమినేట్‌ అవుతారని తెలిపారు. ఫైనల్‌గా కుమార్‌ సాయి ఎలిమినేట్‌ అయ్యారు. మోనాల్‌ కన్‌ ఫెషన్‌ రూమ్‌లో ఉండిపోయింది. మరి ఆమెకి ఎలాంటి టార్గెట్ ఉంటుందనేది చూడాలి.
undefined
click me!