ఓటీటీ అభిమానులకు షాక్‌.. థియేటర్లోకి శివాజీ `సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని`?

Published : Feb 10, 2026, 10:25 PM IST

శివాజీ, లయ కలిసి నటించిన `సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని` మూవీ ఓటీటీలో రావాల్సి ఉంది. కానీ ఇప్పుడు థియేటర్ కి షిఫ్ట్ అయ్యిందట. ఓటీటీ రిలీజ్‌ వాయిదా పడిందని సమాచారం. 

PREV
14
థియేటర్లోకి ఓటీటీ ఫిల్మ్స్

ఇటీవల చాలా సినిమాలు థియేటర్లు ఆడకపోయినా ఓటీటీలో మాత్రం బాగా ఆడుతున్నాయి. బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచిన మూవీస్‌ ఓటీటీ మాధ్యమాల్లో మాత్రం సూపర్‌ హిట్ అవుతున్నాయి. అదే సమయంలో ఓటీటీ కోసం చేసిన సినిమాలు కూడా థియేటర్‌ రేంజ్‌ కంటెంట్‌తో ఉండటం విశేషం. ఆ మధ్య `రాజు వెడ్స్ రాంబాయి` మూవీ ఓటీటీ కోసం చేశారు ఈటీవీ విన్‌, వేణు ఉడుగుల. కానీ కంటెంట్‌ వచ్చిన తీరుని చూసి థియేటర్‌ లో ఆడే ఫిల్మ్ అని అర్థమయ్యింది. థియేటర్లలో విడుదల చేయగా, సూపర్‌ హిట్‌ గా నిలిచింది. ఊహించని కలెక్షన్లతో బాక్సాఫీసు వద్ద దుమ్మురేపింది. ఇలానే ఇప్పుడు శివాజీ మూవీ కూడా థియేటర్లోకి రాబోతుందట. 

24
ఓటీటీలో రిలీజ్‌ కావాల్సిన `సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని`

 శివాజీ నటించిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద మంచి ఆదరణ పొందుతున్నాయి. `కోర్ట్` మూవీ ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. వంద కోట్ల వరకు వెళ్లింది. అలాగే ఇటీవల `దండోరా` కూడా థియేట్రికల్‌గా ఆదరణ పొందింది. ఇప్పుడు ఆయన నటించిన `సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని` అనే చిత్రాన్ని థియేటర్లోకి తీసుకురాబోతున్నారు. అయితే ఇటీవల ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. ఇందులో ఓటీటీలోనే తమ మూవీని విడుదల చేస్తామని ప్రకటించారు.

34
`సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని` ఓటీటీ వాయిదా, థియేటర్‌ రిలీజ్‌ ప్లాన్‌

కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నారట. చాలా మంది ట్రైలర్‌ చూసి థియేటర్లో ఆడే సినిమా అని చెప్పడంతో థియేటర్లో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారట. ట్రైలర్‌ ఈవెంట్‌లో స్టేజ్ పై కూడా దర్శకుడు అనిల్‌ రావిపూడి ట్రైలర్‌ బాగుందని, థియేటర్లో రిలీజ్‌ చేయాలని తెలిపారు.  మేకర్స్ ఆ సమయంలో ఓటీటీలోనే రిలీజ్‌ చేయబోతున్నట్టు తెలిపారు. కానీ థియేటర్‌లోకి తీసుకురావాలనే డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో ఈటీవీ విన్‌,  శివాజీ, చిత్ర మేకర్స్ తమ నిర్ణయాన్ని మార్చుకున్నారట. థియేటర్లోనే విడుదల చేయాలని భావిస్తున్నారట. ప్రేమికుల రోజు స్పెషల్‌గా ఈ నెల 12న ఓటీటీలో విడుదల చేయాలనుకున్న ఈ చిత్రాన్ని వాయిదా వేసినట్టు టాక్‌. వచ్చే నెల(మార్చి) థియేటర్లో రిలీజ్‌ చేయాలని భావిస్తున్నారట. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.

44
ఆకట్టుకున్న `సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని` ట్రైలర్‌

ఇక శివాజీ, లయ జంటగా నటించిన `సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని` మూవీకి సుధీర్‌ శ్రీరామ్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతో శివాజీ నిర్మాతగా మారారు. ఆయన శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై దీన్ని నిర్మించారు. రోహన్‌, ప్రిన్స్, అలీ, ధన్‌ రాజ్‌, ఇమ్మాన్యూయెల్‌ వంటి వారు నటించారు.  రంజిన్‌ రాజ్‌ సంగీతం అందించారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌ ఆకట్టుకుంది. ఆద్యంతం ఎంగేజ్‌ చేసింది. క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌గా సినిమా సాగుతుందని తెలుస్తోంది. ఓటీటీ నుంచి ఇది థియేటర్లోకి మారుతున్న నేపథ్యంలో ఓటీటీ అభిమానులకు ఇది షాకిచ్చే వార్త అనే చెప్పొచ్చు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories