OTT Movies: సమంత నుంచి చిరంజీవి కూతురు వరకు, ఇదెక్కడి ర్యాంపేజ్ బాబోయ్.. ఓటీటీలో చూడాల్సిన టాప్ 6 మూవీస్

Published : Feb 19, 2026, 03:57 PM IST

టాలీవుడ్ మహిళా నిర్మాతలు నిర్మించిన సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్నాయి. ఓటీటీలో తప్పక చూడాల్సిన మహిళా నిర్మాతల టాప్ 6 సినిమాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
17
టాలీవుడ్ లో మహిళా నిర్మాతలు

టాలీవుడ్ లో మహిళా నిర్మాతలు నెమ్మదిగా పెరుగుతున్నారు. పురుషులని డామినేట్ చేసేలా అద్భుతమైన సినిమాలు నిర్మిస్తున్నారు. వీరిలో కొందరు నటీమణులు, సెలెబ్రిటీ డాటర్స్ కూడా ఉన్నారు. సమంత, సుష్మిత కొణిదెల, హన్షిత రెడ్డి లాంటి వారు నిర్మాతలుగా రాణిస్తున్నారు. టాలీవుడ్ లో మహిళా నిర్మాతలు నిర్మించిన టాప్ 6 మూవీస్ ఏంటి ? ఆ సినిమా ఏ ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

27
కమిటీ కుర్రోళ్ళు - నిహారిక కొణిదెల

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన మూవీ కమిటీ కుర్రోళ్ళు. విలేజ్ పాలిటిక్స్ నేపథ్యంలో ప్రస్తుతం సమాజంపై సెటైరికల్ గా, యువతకు నచ్చే అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ మూవీ థియేటర్స్ లో మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉంది.

ఎక్కడ చూడాలి : ఈటీవి విన్

37
కల్కి 2898 ఎడి - ప్రియాంక దత్, స్వప్న దత్

అగ్ర నిర్మాత అశ్విని దత్ కుమార్తెలు ప్రియాంక దత్, స్వప్న దత్ మహిళా నిర్మాతలుగా టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ తో ఏకంగా కల్కి 2898 ఎడి అనే పాన్ ఇండియా సినిమా నిర్మించి సంచలనం సృష్టించారు. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఎక్కడ చూడాలి: ప్రైమ్ వీడియో

47
మన శంకర వరప్రసాద్ గారు - సుష్మిత కొణిదెల

రీసెంట్ గా సంక్రాంతికి విడుదలైన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం రీజినల్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ చిత్ర నిర్మాతలలో చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల కూడా ఒకరు. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో దుమ్ములేపుతోంది.

ఎక్కడ చూడాలి: జీ5

57
శుభం - సమంత

స్టార్ హీరోయిన్ సమంత ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీలో ఆమె చిన్న పాత్రలో కూడా నటించారు. హారర్ కామెడీ చిత్రంగా శుభం ఆకట్టుకుంది.

ఎక్కడ చూడాలి : జియో హాట్ స్టార్

67
హనుమాన్ - చైతన్య రెడ్డి

పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ అయిన హనుమాన్ చిత్రానికి చైతన్య రెడ్డి సమర్పకురాలిగా వ్యవహరించారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజ సజ్జా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ దేశవ్యాప్తంగా కలెక్షన్స్ వర్షం కురిపించింది.

ఎక్కడ చూడాలి : జీ5

77
బలగం - హన్షిత రెడ్డి

దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డి బలగం చిత్రాన్ని నిర్మించారు. తెలంగాణ నేటివిటి, భావోద్వేగాలతో బలగం మూవీ ప్రేక్షకులని కట్టి పడేసింది. జబర్దస్త్ కమెడియన్ వేణు ఈ చిత్రానికి దర్శకత్వం వహించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు.

ఎక్కడ చూడాలి : ప్రైమ్ వీడియో

Read more Photos on
click me!

Recommended Stories