సమంత రిస్క్ చేస్తుందా?.. ఫెయిల్యూర్‌ రైటర్‌ కథతో సినిమా?.. ఫ్యాన్స్ లో టెన్షన్‌?

First Published May 26, 2023, 8:25 PM IST

సమంత ఇప్పటికే `శాకుంతలం`లో ఫెయిల్యూర్‌ని చవిచూసింది. ఈ క్రమంలో కొత్త ప్రాజెక్ట్ విషయంలో ఆమె రిస్క్ చేస్తుందట. నందిని రెడ్డితో చేయబోతున్న సినిమా విషయంలో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారట.

`శాకుంతలం` సినిమా కొట్టిన దెబ్బ మామూలుది కాదు. అటు నిర్మాతలు, దర్శకుడు మాత్రమే కాదు, సమంత సైతం చాలా ఎఫెక్ట్ అయ్యింది. ఆమె కెరీర్‌ని ఈ సినిమా ఒక్కసారిగా షేక్‌ చేసింది. దాన్నుంచి కోలుకుని తిరిగి తన సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉంది సమంత. ఆమె విజయ్‌ దేవరకొండతో `ఖుషి` చిత్రంలో నటిస్తుంది. ఇది రొమాంటిక్‌ లవ్‌ స్టోరీగా దర్శకుడు శివ నిర్వాణ రూపొందిస్తున్నారు. దీంతోపాటు హిందీలో `సిటాడెల్‌` చిత్రంలో సమంత నటిస్తుంది.
 

ఇదిలా ఉంటే మరో సినిమాకి సమంత ఓకే చెప్పిందట. కుర్ర హీరో సిద్ధు జొన్నలగడ్డతో కలిసి సినిమా చేస్తుందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. దీనికి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తుందని సమాచారం. సమంతతో నందిని రెడ్డి చాలా కాలంగా ఓ సినిమాకి ప్లాన్‌ చేస్తుంది. అది ఇదే అని తెలుస్తుంది. ఈ సినిమాని ఎస్‌ఆర్‌టీ ప్రొడక్షన్‌ రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్నారట. అయితే దీనికి ప్రముఖ రైటర్‌ బీవీఎస్‌ రవి కథ అందిస్తున్నట్టు సమాచారం. 
 

బీవీఎస్‌ రవి ఇప్పటికే దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. `వాంటెడ్‌`, `జవాన్‌` చిత్రాలను రూపొందించారు.  ఈ రెండు సినిమాలు పరాజయం చెందాయి. రైటర్‌గా ఆయన ఎన్నో సినిమాలకు పని చేశారు. కానీ దర్శకుడిగా సక్సెస్‌ కాలేకపోయారు. దీంతో ఇతర దర్శకుల వద్ద స్క్రీన్ ప్లే రైటర్‌గా వర్క్ చేస్తున్నారు. అడపాదడపా కథలు కూడా అందిస్తున్నారు. అయితే ఇటీవల ఆయన కథలు అందించిన సినిమాలు కూడా బోల్తా కొడుతుండటం గమనార్హం. 
 

గతేడాది వచ్చిన `థ్యాంక్యూ` సినిమాకి కథ అందించింది బీవీఎస్‌ రవినే. జస్ట్ థ్యాంక్స్ చెప్పే కాన్సెప్ట్ తో రూపొందించిన ఈ సినిమా దారుణమైన ఫలితాన్ని చవిచూసింది. నాగచైతన్య ఇందులో హీరోగా నటించగా, రాశీఖన్నా, అవికా గోర్‌, మాళవిక నాయర్‌ హీరోయిన్లుగా నటించారు. దిల్‌రాజు దీన్ని నిర్మించారు. దీంతో ఇప్పుడు సమంత సినిమాకి బీవీఎస్‌ రవి కథ అందిస్తున్నారనే ప్రచారంతోనే అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. సమంత ఇప్పటికే ఫెయిల్యూర్‌లో ఉంది. మళ్లీ ఇలాంటి రిస్క్ లు అవసరమా అనే టాక్‌ వస్తుంది. నందిని రెడ్డి ఇటీవల `అన్ని మంచి శకునములే` చిత్రంతో వచ్చింది. అది దారుణమైన ఫలితాన్ని చవిచూసింది. ఇలా రెండు రకాలుగా సామ్‌ రిస్క్ చేస్తుందని ఆమె ఫ్యాన్స్ కామెంట్‌ చేస్తున్నారు.
 

కథ బాగుంటే, దాన్ని దర్శకులు అంతే బాగా తెరపైకి ఎక్కించగలిగితే, నటీనటులు ఆ కథని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళితే ఈ కామెంట్లు, రూమర్స్ అన్నీ పక్కకెళ్లి ఆడుకోవాల్సిందే. మరి అలా నందినిరెడ్డి చేస్తారా? అనేది ఇప్పుడు సస్పెన్స్.మరి ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల్లో అసలు నిజమెంతా? అనేది కూడా మున్ముందు తేలనుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే సమంత, నందినిరెడ్డి కాంబినేషన్‌లో `జబర్దస్త్`, `ఓబేబీ` చిత్రాలు వచ్చాయి. `ఓ బేబీ` హిట్‌ అయ్యింది. `జబర్దస్త్` పోయింది.

click me!