ఇందులో సమంత చెబుతూ, పూర్తిగా ఆ చీకటి రోజులను మర్చిపోలేకపోతున్నానని చెప్పింది. తాను ఇండిపెండెంట్ ఉమెన్ అని, బలమైన మహిళగా అందరు అభివర్ణిస్తున్నారు, కానీ తనని తాను అలా అనుకోవడం లేదని తెలిపింది సమంత. నాగచైతన్యతో విడాకుల తర్వాత ఎన్నో కన్నీళ్లు, కష్టాలు, బాధలను చూశానని చెప్పింది. నాకు మంచే జరుగుతుందా అని తరచూ అమ్మని అడుతూ ఉండేదట. క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు చీకటి రోజులు చూశానని వెల్లడించింది సమంత.