Samantha Post: ట్రెండ్‌ అవుతోన్న సమంత పోస్ట్.. అర్థాలు వెతుక్కుంటున్న నెటిజన్లు.. చెడు తర్వాత మంచేనా?

First Published Nov 12, 2021, 9:40 PM IST

సమంత ఒక సంచలనం. ఆమె నిర్ణయాలు ఇప్పుడు సంచలనాత్మకంగానే మారుతున్నాయి. తాజాగా సోషల్‌ మీడియా అటెన్షన్‌ని గ్రాస్ప్ చేస్తుంది సమంత. తన గురించి అంతా చర్చించుకునేలా చేస్తుంది. హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

Samantha

సమంత(Samantha) నాగచైతన్య(Naga Chaitanya)తో విడాకుల(Divorce) ప్రకటన అనంతరం డేరింగ్‌గా ముందుకు సాగే ప్రయత్నం చేస్తుంది. తన జీవితంలో చోటు చేసుకుని క్లిష్టమైన పరిస్థితి నుంచి, మానసిక సంఘర్షణ నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేస్తుంది. అందుకు కెరీర్‌పై ఫోకస్‌ పెట్టింది. నిత్యం బిజీగా ఉండాలని భావిస్తుంది. ఆ దిశగా అడుగులు వేస్తుంది. అదే సమయంలో పరోక్షంగా తన మనసులోని బాధని పోస్టుల రూపంలో, కొన్ని కొటేషన్ల రూపంలో పంచుకుంటుంది సమంత. తన జీవితంలో చోటుచేసుకున్న విషయాలను అభిమానులకు చెప్పే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా తాజాగా సమంత పంచుకున్న ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్‌ అవుతుంది. 

సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే. నిత్యం వరుసగా పోస్ట్ లు పెడుతూ అభిమానులకు తన ఆవేదన తెలియజేస్తుంది. జనాలకు కూడా తన బాధని తెలిపే ప్రయత్నం చేస్తుంది. తాజాగా సమంత ఓ కొట్టేషన్‌ని పంచుకుంది. ఇన్‌స్టా స్టోరీస్‌లో  ఓ ఫోటోని(Samantha Post) పంచుకుంది. ఇందులో జరగబోయే మంచి గురించి చెప్పింది. 

`ఏదో మంచి జరగబోతుందనే విషయాన్ని ఎల్లప్పుడు గుర్తుపెట్టుకోండి` అని పోస్ట్ చేసింది Samantha. ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకున్న ఈ పోస్ట్ ఇప్పుడు అందరిని ఆలోచింప చేస్తుంది. సస్పెన్స్ ని క్రియేట్ చేయబోతుంది. సమంత తన జీవితానికి సంబంధించిన ఏదో విషయాన్ని చెప్పబోతుందనే కామెంట్లు వస్తున్నాయి. త్వరలో తాను మంచి పనులతో ముందుకు రాబోతుందని, తన జీవితంలో మరో మంచి జరగబోతుందనే విషయాన్ని సమంత చెబుతుందని అంటున్నారు నెటిజన్లు.

అయితే ప్రస్తుతం సమంత జీవితంలో చెడు జరిగింది. తాను ఎంతో ప్రేమించిన పెళ్లి చేసుకున్న నాగచైతన్యతో విడిపోయారు. నాలుగేళ్ల అన్యోన్న బంధానికి అక్టోబర్‌ 2న ఫుల్‌స్టాప్‌ పెట్టారు. ఇది సమంత జీవితంలో అతిపెద్ద విషాదంగా చెప్పొచ్చు. దాన్నుంచి బయటపడటం అంతా ఈజీ కాదు.  కానీ సమంత ఆ బాధ నుంచి బయటపడేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఇటీవల ఆమె బ్యాక్‌ టూ బ్యాక్ టూర్లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 

విడాకుల ప్రకటకు ముందు ఫ్రెండ్స్ తో వెకేషన్‌కి వెళ్లింది. ఆ తర్వాత చార్ ధామ్‌ యాత్ర నిర్వహించింది. చాలా రోజులపాటు ఆధ్యాత్మిక భావనలో మునిగిపోయింది. ఆ తర్వాత దుబాయ్‌కి వెళ్లింది. అక్కడ తనకు నచ్చి విధంగా షాపింగ్‌ చేయడం, నచ్చిన ఫుడ్‌ తినడం, నచ్చిన విధంగా ఎంజాయ్ వంటివి చేసింది సమంత. మొత్తంగా తనకి తాను బిజీగా ఉంటూ పాత జ్ఞాపకాల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడుతుంది సమంత. ఇష్టమైన పనులు చేస్తూ బిజీగా ఉంటుంది. అందులో భాగంగా పెయింటింగ్‌ కూడా వేస్తుంది 

ఇదిలా ఉంటే సమంత బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలతో రాబోతుంది. ప్రస్తుతం ఆమె `శాకుంతలం` చిత్రంలో నటించింది. మరోవైపు తమిళంలో `కాథువాకుల రెండు కాదల్‌` చిత్రంలో నటించింది. ఇవి విడుదలకు రెడీ అవుతున్నాయి. మరోవైపు ఇటీవల రెండు తెలుగు, తమిళం బైలింగ్వల్‌ చిత్రాలను ప్రకటించింది. బాలీవుడ్‌లోకి కూడా వెళ్లేందుకు ప్లాన్‌ చేసుకుంటుంది సమంత. 

also read: యంగ్ హీరోయిన్ జీవితం నిలబెట్టిన సమంత.. ఆమె కన్నీటి కష్టాలు వింటే, షాకింగ్ డీటెయిల్స్

also read: Samantha: విడాకుల ప్రకటన వంటి హార్ట్ బ్రేక్‌ ఘటన నుంచి బయటపడేందుకు సమంత ఏం చేస్తుందో తెలుసా ?.. 7 దారులు

click me!