అడ్డం తిరిగిన పరిస్థితులు, సమంతని ఇంకా వేధిస్తున్న మయోసైటిస్.. నిర్మాతలకి సామ్ రిక్వస్ట్

First Published Dec 14, 2022, 5:05 PM IST

వరుసగా అద్భుతమైన చిత్రాలతో దూసుకుపోతున్న సమంతకి ఆరోగ్య సమస్యలు బ్రేక్ వేశాయి. కొన్ని నెలల నుంచి సమంత మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.

వరుసగా అద్భుతమైన చిత్రాలతో దూసుకుపోతున్న సమంతకి ఆరోగ్య సమస్యలు బ్రేక్ వేశాయి. కొన్ని నెలల నుంచి సమంత మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. మయోసైటిస్ నుంచి కోలుకునేందుకు సమంత యుఎస్ లో ట్రీట్మెంట్ తీసుకుంది. దీనితో సమంత చాలా కాలం అభిమానుల నుంచి, సినిమా షూటింగ్స్ నుంచి దూరంగా ఉంటోంది. 

ఇటీవల యశోద ప్రమోషన్స్ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటర్వ్యూలు ఇచ్చి వెళ్ళింది. యుఎస్ లో చికిత్స తీసుకున్న తర్వాత సమంత కోలుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఆమె పూర్తిగా కోలుకోవడం ఇంకా ఆలస్యం అవుతోందట. దీనితో సమంతకి ఇంకా చికిత్స కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. 

సమంత ఆరోగ్య సమస్యల కారణంగా ఆమె నటిస్తున్న 'ఖుషి' చిత్రం ఆగష్టులో వాయిదా పడింది. తనకు మరికొన్ని రోజుల పాటు టైం కావాలని సమంత ఖుషి నిర్మాతలని రిక్వస్ట్ చేసిందట. దీనితో విజయ్ దేవరకొండ ఖుషి చిత్రం ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

అయితే ఇటీవల సమంత సౌత్ కొరియా వెళుతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ అవన్నీ రూమర్స్ మాత్రమే. సమంత ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.  

ఖుషి వాయిదా పడడంతో విజయ్ దేవరకొండ మరో చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుందట. లైగర్ తో దెబ్బతిన్న విజయ్ దేవరకొండ అర్జెంట్ గా ఓ హిట్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. 

ఇక సమంతకి బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ వస్తున్నాయి. కానీ ఆమె ఆరోగ్య సమస్య ప్రస్తుతం కెరీర్ కి పెద్ద ఇబ్బందిగా మారింది. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా సమంత 'యశోద' చిత్రంతో అద్భుతమైన విజయం అందుకుంది. ఎన్ని సమస్యలు ఎదురైనా సమంత విజయాల్ని అడ్డుకోలేకున్నాయి. 

click me!