ఇప్పుడు సమంత, రాజ్ నిడిమోరు కూడా ఇందులోనే వివాహం చేసుకున్నారు. అయితే ఈ భూత శుద్ధి వివాహం ఏంటనేది చూస్తే, సృష్టిలో పంచభూతాలైన నింగి, నేల, నీరు, నిప్పు, వాయువు శుద్ధీకరణ ద్వారా ఇద్దరు వ్యక్తులు వివాహ బంధంతో ఒక్కటి కావడమే ఈ భూత శుద్ధి వివాహం. అన్ని వివాహాల్లో దీన్ని అత్యంత పవిత్రమైన వివాహంగా భావిస్తుంటారు. ఈ వివాహ ప్రక్రియలో వధూవరుల దేహాల్లోని పంచ భూతాలను శుద్ధి చేస్తారు. పెళ్లి చేసుకునే జంట మధ్య మానసికంగా, భౌతికంగా లోతైన బంధాన్ని ఏర్పరచడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఇద్దరు వ్యక్తుల మధ్య లోతైన, భౌతిక బంధాన్ని సాధించడం దీని ముఖ్య ఉద్దేశం. ఉచ్ఛ్వాస, నిశ్వాసలకు అతీతంగా ప్రాణ, మరణ భయాలకు, ఆందోళనలకు దూరంగా అన్ని రకాల భావోద్వేగాలకు దూరంగా లింగ భైరవి అనుగ్రహంతో నిర్వహించే వివాహ వేడుకే ఈ భూత శుద్ధి వివాహంగా చెబుతుంటారు. ఇప్పుడు సమంత, రాజ్ ఈ ప్రత్యేకమైన ట్రెడిషన్లో వివాహం చేసుకోవడం విశేషం. దీంతో ఇప్పుడిది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.