
సమంత(Samantha), నాగచైతన్య(NagaChaitanya) నాలుగేండ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికారు. అక్టోబర్ 2న వీరిద్దరు సంయుక్త ప్రకటన చేశారు. ఇకపై తాము కలిసి ఉండలేకపోతున్నామని, విడిపోతున్నట్టు చెప్పారు. దూరమైన తమ మధ్య స్నేహం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ ప్రకటనతో టాలీవుడ్తోపాటు సౌత్ ఇండస్ట్రీ మొత్తం షాక్కి గురయ్యింది. ఇక ఇద్దరి అభిమానుల గుండె ఆగినంత పనైంది. ఈ వార్త ఇప్పటికే వైరల్ అవుతుంది. నిత్యం చర్చనీయాంశంగా మారింది.
అయితే విడాకులు అనేది ఎవరి లైఫ్లో అయినా పెద్ద విషాదకర వార్తగా చెప్పొచ్చు. ఇంకా మహిళల విషయంలో అది మరింత బాధగా ఉంటుంది. ఆ మానసిన సంఘర్షణని తట్టుకోవడం కష్టమే. ఈ విషయంలోSamantha కూడా ఎంతో బాధకి గురైనట్టు తెలిపింది. చనిపోతానేమో అనే భావన కూడా కలిగిందని తాజాగా సమంత ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆ వేదనని ఎదురించి నిలబడగలనా, అసలు తన ప్రాణం నిలుస్తుందా? అనే అనుమానం కలిగిందట. ఈ విషయాన్ని వెల్లడించి మరింత షాక్కి గురిచేసింది. సంచలనానికి తెరలేపింది.
ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా మరో విషయం చర్చనీయాంశం అవుతుంది. చైతన్యతో విడాకులు ఆమె వ్యక్తిగత జీవితానికి పూడ్చలేని నష్టమైనా, కెరీర్ పరంగా హెల్ప్ అయ్యిందంటున్నారు సినీ విశ్లేషకులు. ఇటీవల సమంత వరుసగా భారీ సినిమాలను ప్రకటిస్తుంది. ప్రస్తుతం ఆమె తెలుగులో ఒకటి, తమిళంలో ఓ సినిమా చేసింది. అవి రిలీజ్కి రెడీ అవుతున్నాయి. వీటితోపాటు దసరా కానుకగా మరో మల్టీలింగ్వల్ సినిమాలను ప్రకటించింది.
వీటిలో శ్రీదేవి మూవీస్ పతాకంపై పాన్ ఇండియా సినిమా చేస్తుంది. దీనికి `యశోద` అనే టైటిల్ని ప్రకటించారు. హరి, హరీష్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ రెండు రోజుల క్రితం ప్రారంభమైంది. వీటితోపాటు ఓ ఇంటర్నేషనల్ మూవీ కూడా చేస్తుంది సమంత. ఇటీవలే ఆ విషయాన్ని ప్రకటించింది. మరోవైపు `ది ఫ్యామిలీ మ్యాన్` తరహాలో ఓ భారీ వెబ్ సిరీస్లో కూడా నటిస్తుందని, దీనికిగానూ సమంతకి భారీ పారితోషికం ఇస్తున్నట్టు టాక్.
ఇదంతా ఓ ఎత్తైతే తాజాగా మరో కొత్త విషయం తెరపైకి వచ్చింది. సమంత.. చైతూతో డైవర్స్ కి ముందు కంటే ఇప్పుడే ఎక్కువ ఫాలోయింగ్ వచ్చిందనే టాక్ మొదలైంది. డైవర్స్ మ్యాటర్ విషయంలో పాజిటివ్గా, నెగటివ్గా ఎలాగైనా అత్యధికంగా మీడియా అటెన్షన్ మాత్రం సమంత మీదే ఉంది. నాగచైతన్యకి అక్కినేని వంటి బ్రాండ్ లాంటి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉంది. కానీ మీడియా ఫోకస్ మొత్తం సమంత చుట్టూనే సాగడం విశేషం.
ఆమెకి సంబంధించిన విశేషాలే ప్రధానంగా ఫోకస్ అయ్యాయి. అయితే నెగటివ్ విషయంలో సమంత ఘాటుగానే స్పందించింది. అలాంటివి ప్రసారం చేయోద్దని, తన మానసిక స్థితిని అర్థం చేసుకోవాలని చెప్పింది. ఈ కోణం పక్కన పెడితే, మరో కోణంలో మాత్రం ఈ డైవర్స్ మ్యాటర్ సమంతకే ప్లస్ అయ్యిందని అంటున్నారు విశ్లేషకులు. ఆమెకి ఊహించిన విధంగా ఫాలోయింగ్ పెరిగిందని, నేషనల్ వైడ్గా పాపులారిటీని సొంతం చేసుకుందనే టాక్ కూడా వస్తుంది.
`ది ఫ్యామిలీ మ్యాన్ 2`తో సమంతకి నార్త్ లోనూ గుర్తింపు వచ్చింది. ఆ వెంటనే ఈ డైవర్స్ వార్త మరింతగా వెళ్లిపోయింది. చాలా వరకు సమంతపై సానుభూతి చూపించడం ప్రారంభమైంది. ఆమె ఎప్పుడు ఎలా స్పందిస్తుందనే విషయంపై నెటిజన్లు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. దీనికితోడు సమంత పరోక్షంగా తన లైఫ్కి సంబంధించిన పోస్ట్ లు పెట్టగా అవి నేషనల్ వైడ్గా వైరల్ కావడం సమంత పాపులారిటీని తెలియజేస్తున్నాయి.
ఓ రకంగా పాన్ ఇండియా ఇమేజ్ సమంత సొంతమైందంటున్నారు క్రిటిక్స్. ఇప్పుడు సమంతకి సినిమాలకు అతీతంగా గుర్తింపు వచ్చిందని, ఆమె మార్కెట్ పెరిగిందని, క్రేజ్ పెరిగిందని అంటున్నారు. అందుకు ఆమెకి వస్తోన్న అవకాశాలే ఉదాహరణగా చెప్పుకోవచ్చు అంటున్నారు. చైతూతోనే ఉంటే, ఇప్పటి సమంత లోకల్ సినిమాలే చేసుకునేదని, టాలీవుడ్, కోలీవుడ్కే పరిమితమయ్యేదని అంటున్నారు.
అదే సమయంలో సమంత కూడా హద్దులు చెరిపేసి గ్లామర్ షో చేయడం కూడా తన క్రేజ్ని, ఫాలోయింగ్ పెరగడానికి కారణమైందని అంటున్నారు. మొత్తంగా సమంత తన జీవితంలో ఒకటి కోల్పోయి, మరికొకటి పొందిందని చెప్పొచ్చు. సమంత కూడా తన అసలు గేమ్ ప్రారంభం కాబోతుందని పరోక్షంగా చెబుతూనే ఉండటం విశేషం.
సమంతతో పోల్చితే.. నాగచైతన్యకి ఆ స్థాయి పాపులారిటీ రాలేదు. ఆయన గురించి అటెన్షన్ చాలా తక్కువ. పైగా ఆయన స్పందించింది కూడా లేదు. అప్పటి నుంచి చైతూ సైలెంట్ అయ్యారు. కేవలం `లవ్స్టోరీ` సినిమా టైమ్లోనే సందడి చేశారు. ఆ తర్వాత ఎక్కడా ఆయనకు సంబంధించిన చర్చ లేకపోవడం గమనార్హం.